ప్రజలకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలి

శ్రీకాళహస్తి ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన ఆధునిక పరికరాలు, లాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ప్రభుత్వం వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read more

సామాజిక న్యాయాన్కి కట్టుబడి వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడే

మాదిగల కృతజ్ఞత యాత్రలోఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి):సామాజిక న్యాయాన్నికి కట్టుబడి, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటించింది, నేడు వర్గీకరణ చేసింది కూడా చంద్రబాబు నాయుడేనని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ స్పష్టంచేశారు. కర్నూల్ టౌన్ చేరుకున్న ‘చంద్రబాబుకు మాదిగల కృతజ్ఞత’ యాత్ర సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ…

Read more

రాజీవ్ నగర్ అక్రమాలపై విచారణ నిరంతరం ప్రక్రియ…భూ బకాసురులు వదిలే ప్రసక్తి లేదు

త్వరలో మాజీ ఎమ్మెల్యే పై చర్యలు తప్పవు విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టంప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీ కాళహస్తిలోని భూ అక్రమాలపై, భూ బకాసురులపై విచారణ నిరంతర ప్రక్రియ అని, రాజీవ్ నగర్ నుంచి భూ అక్రమాలపై విచారణ ప్రక్రియ మొదలు పెట్టామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

Read more

ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను బోధించాలి

ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను విద్యార్థులకు బోధించాలని ఓజిలి జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మంజులమ్మ అన్నారు. గురువారం స్థానిక విద్య వనరుల కేంద్రం వద్ద నిర్వహించిన గురు పూజ దినోత్సవం సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ విద్య అభివృద్ధి విషయంలో నిరంతర సాధనతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. కేవలం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం చదువుకాదని, ఉపాధ్యాయులలో ఉన్న…

Read more

కార్పొరేషన్ లో పెండింగ్ పనులు ప్రతి పాదనలను పంపండి

తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వరప్రసాద్ రావుప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తో చర్చించి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎన్డీయే కూటమి బిజెపి నాయకులు,తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ వరప్రసాద్ రావు కమీషనర్ ఎన్ మౌర్య కు సూచించారు. మంగళవారం తిరుపతి తుడా కార్యాలయంలో తుడా వైస్…

Read more

ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలి

ఎస్‌టిల ఆర్థిక పరిపుష్టికి ప్రాధాన్యత: కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ప్రభాతదర్శిని ( నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు: జిల్లాలో 2024-2025 ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసేందుకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ ప్లాన్‌ అమలుకు శాఖలవారీగా పొందుపరచాల్సిన నివేదికపై కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం…

Read more

కిషోర్ కుమార్ కు ఆర్యవైశ్య మహాసభ నేతల ఘన సన్మానం

ప్రభాతదర్శిని, (పుత్తూరు-ప్రతినిధి):తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వడమాలపేట,పుత్తూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. పుత్తూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంకు వెళ్లిన తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వారు ఘన స్వాగతం పలికారుఈ సందర్భంగా ఆయనకు శాలవాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.అనంతరం…

Read more

రైతు బాంధవుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు: ఎమ్మెల్యే కాకర్ల సురేష్

రైతన్నలకు అండగా ఉంటా, వారికోసం ఎంత దూరమైనా వస్తా:ఉదయగిరి ఎమ్మెల్యేప్రభాతదర్శిని (వింజమూరు-ప్రతినిధి): రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన హయాంలో రైతన్నలకు అన్ని విధాల లబ్ధి చేకూరింది అని రైతన్నలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం వింజమూరు మండల పరిధిలోని ఊటుకూరు గ్రామపంచాయతీ ఆర్ బి కే కార్యాలయం నందు ఆయిల్ ఫామ్ సాగుపై…

Read more

భారత కరెన్సీ నోట్లపై 15 ప్రాంతీయ భాషల పేర్లు

ప్రభాతదర్శిని, ప్రతినిధి: భారత కరెన్సీ నోట్లపై 15 ప్రాంతీయ భాషల పేర్లుదేశంలో 22 భాషలకు అధికారిక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల ప్రజలు భారత కరెన్సీని సులభంగా అర్ధం చేసుకునేందుకు 15 ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ముద్రిస్తోంది. ఆ జాబితాలో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు,…

Read more

ముందస్తుగా పింఛన్ల నగదు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే…సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ

ప్రభాతదర్శిని (నాయుడుపేట- ప్రతినిధి): దేశ చరిత్రలో పెన్షన్ల నగదను ముందుగా లబ్ధిదారులకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయ శ్రీ కొనియాడారు. శనివారం నాయుడుపేట పట్టణంలోని అగ్రహార పేట, అమర గార్డెన్స్ మసీదు వీధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబరు1వ…

Read more

error: Content is protected !!