ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో బి నందిని 934 మార్కులు, బైపిసి లో షకీలా 963 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్, బైపీసీలో 11మంది 900 మార్కులు పైన, ఎంపీసీలో ఒకరు 900 మార్కులుపైన సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో తొమ్మిది మంది, బైపీసీలో ఐదు మంది 400 మార్కులు పైన సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.రౌతు రమోల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల కృషి ఫలితమే ఇంటర్మీడియట్ ఫలితాలని ఆమె తెలిపారు.
ఇంటర్ లో పుదూరు గురుకులం విద్యార్థుల హవా
Related Posts
బి.ఎడ్ ప్రాక్టికల్స్ పేరిట “ఆకు”ను నాకేసిన ఆ నలుగురు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అధికారులు
ఆది నుంచి అంతం వరకు అన్ని అక్రమ మార్గాలే చోద్యం చూస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రభాతదర్మిని, (అమరావతి-ప్రత్యేక ప్రతినిధి): అవినీతి,అక్రమాలకు తావు లేకుండా సత్శీలమైన, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తామని 2024వ సంవత్సరంలో జరిగిన జమిలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు హామీలను గుప్పించిన ఉమ్మడి కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్యాశాఖ పరంగా…
Read moreమత మార్పిడి ఆధారంగా కాకుండా వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే రద్దు చేయండి:మంద కృష్ణ మాదిగ
కుల వ్యవస్థ రద్దుపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలని డిమాండ్హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలాప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి): న్యాయవ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా, దేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు…
Read more