తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పు
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను పగడ్బందీగా నిరూపించి ముద్దాయిలకు శిక్ష పడేలా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా క్రైమ్ నెంబరు 06-2020లో కరకంబాడి బీటు, తిరుపతి రేంజి పరిధిలో పట్టుబడ్డ ప్రకాశం జిల్లాకు చెందిన చెరబోయిన వెంకటరమణ, పింజరి మహబూబ్ బాషా ఇద్దరు ముద్దాయిలు చేసిన నేరం రుజువయ్యింది. దీంతో తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహ మూర్తి ఒకొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు అభినందించారు. శేషాచలం రిజర్వు ఫారెస్టులో అత్యంత విలువైన సహజ సంపద ఎర్ర చందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేసే నేరస్తులకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా పని చేస్తుందని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష…ఒకొక్కరికి రూ. 6లక్షల జరిమానా
Related Posts
శ్రీసిటీలో బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ కీలకంగా నిలుస్తోంది
ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభంలో మంత్రి నారా లోకేష్విద్య–పరిశ్రమల అనుసంధానంతో వర్క్-స్టడీ డ్యూయల్ మోడల్దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుందన్న మంత్రిప్రభాతదర్శిని (శ్రీసిటీ ప్రత్యేక-ప్రతినిధి):వర్క్-స్టడీ డ్యూయల్ మోడల్ కు శ్రీసిటీలో ఎస్ఐయూ అమలు చేస్తున్న బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ కీలకంగా నిలుస్తోందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటీ,ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ (ఎస్ఐయు)ని శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్లో ఆయన…
Read moreఏపీజెఎఫ్ తిరుపతి జిల్లాఅధ్యక్షాప్రధానకార్యదర్శిలుగా జయపాల్ హరిబాబు
24 మందితో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ (ఏపీజెఎఫ్) తిరుపతి జిల్లా అధ్యక్షునిగా అరవ జయపాల్, ప్రధాన కార్యదర్శిగా నత్తం హరిబాబు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నుకున్నారు. సోమవారం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్ లో జరిగిన ఆ సంఘం సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు ఆధ్వర్యంలో వారిని ఎన్నుకున్నారు నిర్ణయించారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షునిగా,…
Read more