ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు పర్య వేక్షణలో నేటి నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. మొత్తం 88 కళాశాలల విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం మొత్తం 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 48మంది పరిశీలకులను, రెండు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.యూజి రెండో సెమిస్టర్ పరీక్షలు సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ఆయా కళాశాలల ప్రధానాచార్యులు,చీఫ్ సూపరింటెండెంట్లు,యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులకు సహకరించాలని డాక్టర్ పద్మజ విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి ఏకేయూ డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు….– పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
Related Posts
నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్ల తొలి గ్రీవెన్స్ డే అర్జీకి న్యాయం జరిగింది
కావలి రమా జ్యోతికి ఇల్లు వచ్చిందయ్యా…! కృతజ్ఞతతో కలెక్టరేట్కు వచ్చిన వృద్ధురాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):“అర్జీ ఇచ్చామా… పని అయిపోయిందా… వెళ్ళిపోయామా” అన్న భావనకు భిన్నంగా, తన సమస్యను పరిష్కరించిన అధికారులకు ధన్యవాదాలు చెప్పేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్కు రావడం విశేషంగా నిలిచింది. ప్రజల అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతుందనే భావన ఉన్న నేపథ్యంలో, ఒక వృద్ధురాలి కృతజ్ఞతాభావం జిల్లా యంత్రాంగంపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచింది. హిమాన్షు శుక్ల నెల్లూరు…
Read moreన్యాయ సేవ కోసం కోర్టు తలుపులు తట్టే ప్రతి వ్యక్తికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులదే
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ప్రభాతదర్శిని, (తిరుపతి – ప్రతినిధి):న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే వేలాది మందికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులందరి పై ఉందని గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, భారత…
Read more