ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):గుంటూరు జిల్లా పెదకాకానికి గ్రామానికి చెందిన బి.ఫార్మసీ విద్యార్థి యం.కిరణ్ కుమార్,ఎంఎస్(ఎం ఫామ్) ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఇండియాలో 77 వ,ర్యాంక్ సాధించాడు.ఎన్ఐపిఈఆర్ ఏఈఈ-2025 సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్.(ఎం.ఫార్మసీ) ఎంబీఏ 2″సం”కోర్స్ ప్రవేశం కొరకు, కిరణ్ కుమార్ పరీక్షలకు హాజరు హాజరయ్యారు. శనివారం వెలువడిన ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 77వ,ర్యాంకు సాధించాడు.అదేవిధంగా మరొక ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాస్టర్స్ (ఎం.టెక్)లో ప్రవేశం కొరకు హాజరైన పరీక్షలలో ఆల్ ఇండియాలో 60వ,ర్యాంక్ లో నిలిచాడు.ఈ సందర్భంగా, గ్రామస్తులు చిన్ననాటి నుండి చదువులో మంచి ప్రతిభను కనబరుస్తూ, టెన్త్ క్లాస్ లో పెదకాకాని హై స్కూల్ కి కూడా మంచి పేరు తెచ్చాడు అదేవిధంగా తను ఉన్నత చదువులు కొనసాగిస్తూ, మంచి ప్రతిభను కనబరుస్తున్నాడని స్థానిక నాయకులు ,మాజీ ఎంపీటీసీ సభ్యులు కుక్కల వెంకటేశ్వర్లు, పెదకాకాని వార్డు మెంబర్లుగోపి గౌడ్,గౌడ సంఘం నేతలు మురళి గౌడ్ జగదీష్ కుమార్ (చిన్ని), బొర్రా.గుడారంకయ్య,దొంత సురేష్,రాష్ట్ర బీసీ సంఘం నాయకులు, శొంఠి నాగరాజు,కేసన శంకర్రావు, కుక్కల రాంప్రసాద్,నాగిడి సాంబశివరావు,మోర్ల వెంకటకృష్ణ (అడ్వకేట్),కాపు సంఘం నేతలు తన్నీరు శివ నాగరాజు,కొమ్మ వాసు కిరణ్ కుమార్ చదువుతున్న కాలేజీ,చేబ్రోలు హనుమయ్య కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ విద్యాధర, టీం అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో చాలామంది విద్యార్థులకు కిరణ్ కుమార్ ఆదర్శంగా నిలవాలని గొప్ప స్థాయికి చేరుకోవాలని అన్నారు.