ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 కు గాను అర్షియా 458 మార్కులు, జయాశ్రీ 453 మార్కులు, హసీద్ 450 మార్కులు, ఈశ్వర్ 446 మార్కులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలల మాదిరిగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ గారు అభినందించారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్. పి.నారాయణ ఆలోచనలతో స్థాపించబడి, ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న మునిసిపల్ జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను అభ్యసించవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేశారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించి మునిసిపల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న లెక్చరర్స్ ను ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు.
ఇంటర్మీడియట్ మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థుల ప్రతిభ
Related Posts
రమాదేవి మల్టీస్పెషల్టి హాస్పిటల్ వెంటనే సీజ్ చేయండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తిరుపతి నగరంలోని స్థానిక భవాని నగర్ లో ఉన్న రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ పలమనేరు మండలం జీడిమకుల పల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో తొమ్మిది రోజుల…
Read moreముత్యాలమ్మ జాతరను విజయవంతంగా నిర్వహిద్దాం:ఆలయ చైర్మన్, ఆలయ ఈవో లు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఈనెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం, తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆ దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు చిల్లకూరు దాశరధరామిరెడ్డి, కార్యానిర్వహాధికారి కొమ్మలపూడి నవీన్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆలయ చైర్మన్ చిల్లకూరు దశరథ రామిరెడ్డి, ఆలయ ఈవో…
Read more