ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 కు గాను అర్షియా 458 మార్కులు, జయాశ్రీ 453 మార్కులు, హసీద్ 450 మార్కులు, ఈశ్వర్ 446 మార్కులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలల మాదిరిగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ గారు అభినందించారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్. పి.నారాయణ ఆలోచనలతో స్థాపించబడి, ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న మునిసిపల్ జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను అభ్యసించవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేశారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించి మునిసిపల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న లెక్చరర్స్ ను ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు.
ఇంటర్మీడియట్ మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థుల ప్రతిభ
Related Posts
శ్రీసిటీలో బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ కీలకంగా నిలుస్తోంది
ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభంలో మంత్రి నారా లోకేష్విద్య–పరిశ్రమల అనుసంధానంతో వర్క్-స్టడీ డ్యూయల్ మోడల్దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుందన్న మంత్రిప్రభాతదర్శిని (శ్రీసిటీ ప్రత్యేక-ప్రతినిధి):వర్క్-స్టడీ డ్యూయల్ మోడల్ కు శ్రీసిటీలో ఎస్ఐయూ అమలు చేస్తున్న బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ కీలకంగా నిలుస్తోందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటీ,ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ (ఎస్ఐయు)ని శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్లో ఆయన…
Read moreఏపీజెఎఫ్ తిరుపతి జిల్లాఅధ్యక్షాప్రధానకార్యదర్శిలుగా జయపాల్ హరిబాబు
24 మందితో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ (ఏపీజెఎఫ్) తిరుపతి జిల్లా అధ్యక్షునిగా అరవ జయపాల్, ప్రధాన కార్యదర్శిగా నత్తం హరిబాబు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నుకున్నారు. సోమవారం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్ లో జరిగిన ఆ సంఘం సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు ఆధ్వర్యంలో వారిని ఎన్నుకున్నారు నిర్ణయించారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షునిగా,…
Read more