అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి చర్యలు: పట్టణ సీఐ బాబి
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):నాయుడుపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఐదు మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ బాబి మాట్లాడారు.నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ ఇంటిని బాడుకు తీసుకొని నివాసం ఉంటూ బయట ప్రాంతాల నుండి మహిళలను తీసుకొచ్చి వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తమకు అందిన సమాచారం మేరకు దాడి చేసి నిర్వాహకురాలు తోపాటు ఇద్దరు మహిళలు,ఇద్దరు పురుషులను అరెస్టుచేసి కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించి అసాంఘిక కార్యక్రమాల నిర్వహించే వారి వివరాలను తమకు తెలియజేయాలని అన్నారు. వివరాలు తెలియజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయన్నారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.