ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో సన్ సైడ్ దుర్మరణం చెందిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు పట్టణలోని కేఎన్ఆర్ పాఠశాలలో సన్షెడ్ కూలి తొమ్మిదో తరగతి చదివే గురు మహేంద్ర(15) అనే విద్యార్థి మృతి చెందారు. నాడు నేడు కింద చేస్తున్న పనులు అసంపూర్ణంగా ఉండడం, ఆ ప్రాంతంలో తరగతులు నిర్వహించడం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న అధికారులు గంటల వ్యవధిలో అప్రమత్తమైన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. విద్యార్థి తల్లిదండ్రులకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు గ్రామీణ టిడిపి గిరిధర్ రెడ్డి, జనసేన నాయకులు కిషోర్, అధికారులు సంతాపం తెలిపి సానుభూతిని వ్యక్తం చేశారు.