ప్రభాతదర్శిని, (సత్యవేడు- ప్రతినిధి): సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గెలుపుతో పుత్తూరు టీబీ రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో లక్ష్మణ్ రాజు తమ మొక్కుబడిని తీసుకున్నారు. ఎన్నికల సమయంలో పుత్తూరుకు చెందిన లక్ష్మణ రాజు సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం విజయం సాధిస్తే షిర్డి సాయినాథునికి నూటొక్క కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటానని మొక్కుకున్నారు. సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం గెలుపొందడంతో శనివారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి పుత్తూరు టీబీ రోడ్డులోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయానికి లక్ష్మణ రాజు చేరుకొని స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూటొక్క కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రాజు, టిడిపి సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, అములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.