తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పు
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను పగడ్బందీగా నిరూపించి ముద్దాయిలకు శిక్ష పడేలా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా క్రైమ్ నెంబరు 06-2020లో కరకంబాడి బీటు, తిరుపతి రేంజి పరిధిలో పట్టుబడ్డ ప్రకాశం జిల్లాకు చెందిన చెరబోయిన వెంకటరమణ, పింజరి మహబూబ్ బాషా ఇద్దరు ముద్దాయిలు చేసిన నేరం రుజువయ్యింది. దీంతో తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహ మూర్తి ఒకొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు అభినందించారు. శేషాచలం రిజర్వు ఫారెస్టులో అత్యంత విలువైన సహజ సంపద ఎర్ర చందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేసే నేరస్తులకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా పని చేస్తుందని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష…ఒకొక్కరికి రూ. 6లక్షల జరిమానా
Related Posts
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది: తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
ప్రభాతదర్శిని(తిరుపతి – ప్రతినిధి):మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు.ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి అదే నిజమని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.అయితే రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులని,ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలిపారు. దీనికి నిదర్శనంగా…
Read moreఅవినీతి ఓజిలి తాహశీల్దార్ పై వేటు…సి సి ఎల్ కే తప్పుడు నివేదిక…’ప్రభాతదర్శిని’ కథనాలకు స్పందన
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలం రెవెన్యూ తాహశీల్దార్ గా పనిచేస్తున్న అరవ పద్మావతి ని సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాహశీల్దార్ అవినీతి అవకతవకలపై ‘ప్రభాతదర్శిని’ ప్రచురించిన వరుస కథనాలపై కొందరు బాధితులు సిసిఎల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సిసిఎల్ అధికారులు తాసిల్దార్ ఇచ్చిన తప్పుడు నివేదికలు ఎండార్స్ మెంట్స్ ను పరిశీలించి వేటు వేశారు. తప్పుడు నివేదికలు ఇవ్వడంలో, అవినీతి సంపాదనకు అలవాటు…
Read more