ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో బి నందిని 934 మార్కులు, బైపిసి లో షకీలా 963 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్, బైపీసీలో 11మంది 900 మార్కులు పైన, ఎంపీసీలో ఒకరు 900 మార్కులుపైన సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో తొమ్మిది మంది, బైపీసీలో ఐదు మంది 400 మార్కులు పైన సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.రౌతు రమోల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల కృషి ఫలితమే ఇంటర్మీడియట్ ఫలితాలని ఆమె తెలిపారు.
ఇంటర్ లో పుదూరు గురుకులం విద్యార్థుల హవా
Related Posts
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రబీకి 3 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి) : రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహామండలిలో తీర్మానించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం జిల్లా కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి…
Read moreతిరుమలలో మరో అపచారం… శ్రీవారి సన్నిధిలో పాదరక్షలు
ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రత్యేక ప్రతినిధి) తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో అపచారం జరిగింది.ఈసారి ఏకంగా పాదరక్షలు వేసుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంతమంది భక్తులు రావడం జరిగింది.కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలో అనేక ప్రచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.లిక్కర్ అలాగే పాన్ పరాక్ గుట్కాలు ఇలా రకరకాల నిషేధిత పదార్థాలను పట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంత మంది…
Read more