ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో బి నందిని 934 మార్కులు, బైపిసి లో షకీలా 963 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్, బైపీసీలో 11మంది 900 మార్కులు పైన, ఎంపీసీలో ఒకరు 900 మార్కులుపైన సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో తొమ్మిది మంది, బైపీసీలో ఐదు మంది 400 మార్కులు పైన సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.రౌతు రమోల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల కృషి ఫలితమే ఇంటర్మీడియట్ ఫలితాలని ఆమె తెలిపారు.
ఇంటర్ లో పుదూరు గురుకులం విద్యార్థుల హవా
Related Posts
ఛార్జర్లపై రాసిన ఈ పదాలకు అర్థం తెలుసుకుందాం
మార్కెట్లో అనేక రకాల ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఛార్జర్లను GaN, PD అని లేబుల్ చేస్తారు. హైపర్ఛార్జ్ లేదా వూక్ వంటి పదాలను ఉపయోగిస్తారు. ప్రతి పదానికి అర్థం ఏమిటో తెలియక చాలా మంది తరచుగా గందరగోళం చెందుతారు. అయితే అవన్నీ ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించినవి. వివిధ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు వారి స్వంత ఛార్జింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తాయి. ఇవి మీ ఫోన్ బ్యాటరీ లైఫ్,…
Read moreఏ.సి.బి అధికారులకు చిక్కిన అవినీతి గ్రామ రెవిన్యూ అధికారి
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామసచివాలయం లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్య నారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. అదే మండలం లోని పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్బుక్ ఇవ్వడానికి రూ.20,000/-లు మేరకు లంచం డిమాండ్ చేసినట్లు నేరుగా…
Read more