ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో బి నందిని 934 మార్కులు, బైపిసి లో షకీలా 963 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్, బైపీసీలో 11మంది 900 మార్కులు పైన, ఎంపీసీలో ఒకరు 900 మార్కులుపైన సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో తొమ్మిది మంది, బైపీసీలో ఐదు మంది 400 మార్కులు పైన సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.రౌతు రమోల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల కృషి ఫలితమే ఇంటర్మీడియట్ ఫలితాలని ఆమె తెలిపారు.
ఇంటర్ లో పుదూరు గురుకులం విద్యార్థుల హవా
Related Posts
భూ వివాదాలు వస్తే స్థానిక కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా ల్యాండ్ టైట్లింగ్ నల్లచట్టం తెచ్చారు
సైకిల్ కు ఓటేశారు…అభివృద్ధికి చోటిచ్చారుప్రజా సంక్షేమమే కూటమికి పరమావధిఅభివృద్ధి కార్యక్రమాలకు కుప్పమే ప్రయోగశాలకుప్పంలో పేదల సేవలో కార్యక్రమం ప్రజావేదికలో ముఖ్యమంత్రిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం బెగ్గిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి…
Read moreరాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి
ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్ ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, అణగారిన కులాల గొంతుకగా నిలవాలని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్ పిలుపు ఇచ్చారు. విజయవాడ లోని జింఖానా గ్రౌండ్స్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ కమిషన్ సభ్యుల…
Read more