ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో బి నందిని 934 మార్కులు, బైపిసి లో షకీలా 963 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్, బైపీసీలో 11మంది 900 మార్కులు పైన, ఎంపీసీలో ఒకరు 900 మార్కులుపైన సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో తొమ్మిది మంది, బైపీసీలో ఐదు మంది 400 మార్కులు పైన సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.రౌతు రమోల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల కృషి ఫలితమే ఇంటర్మీడియట్ ఫలితాలని ఆమె తెలిపారు.
ఇంటర్ లో పుదూరు గురుకులం విద్యార్థుల హవా
Related Posts
రమాదేవి మల్టీస్పెషల్టి హాస్పిటల్ వెంటనే సీజ్ చేయండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తిరుపతి నగరంలోని స్థానిక భవాని నగర్ లో ఉన్న రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ పలమనేరు మండలం జీడిమకుల పల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో తొమ్మిది రోజుల…
Read moreముత్యాలమ్మ జాతరను విజయవంతంగా నిర్వహిద్దాం:ఆలయ చైర్మన్, ఆలయ ఈవో లు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఈనెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం, తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆ దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు చిల్లకూరు దాశరధరామిరెడ్డి, కార్యానిర్వహాధికారి కొమ్మలపూడి నవీన్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆలయ చైర్మన్ చిల్లకూరు దశరథ రామిరెడ్డి, ఆలయ ఈవో…
Read more