ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 కు గాను అర్షియా 458 మార్కులు, జయాశ్రీ 453 మార్కులు, హసీద్ 450 మార్కులు, ఈశ్వర్ 446 మార్కులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలల మాదిరిగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ గారు అభినందించారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్. పి.నారాయణ ఆలోచనలతో స్థాపించబడి, ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న మునిసిపల్ జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను అభ్యసించవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేశారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించి మునిసిపల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న లెక్చరర్స్ ను ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు.
ఇంటర్మీడియట్ మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థుల ప్రతిభ
Related Posts
ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం:నెల్లూరు కార్పొరేషన్, నుడా అధికారుల సమీక్షలో మంత్రి నారాయణ
ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి):కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్, నుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు. లే ఔట్ల…
Read moreసానుకూల దృక్పథంతోనే విజయాలు సాధ్యం…. ఎన్ఎస్ఎస్ అవగాహన కార్యక్రమంలో విక్రమ సింహపురి వర్సిటీ వీసీ శ్రీనివాసరావు
ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సానుకూల దృక్పథంతో వాటిని ఎదుర్కొంటే విజయం సాధించడం సులభమని ప్రముఖ బాల మనోవైద్య నిపుణులు డాక్టర్ వి. సురేశ్ బాబు స్పష్టం చేశారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం, చెముడుగుంట గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ సురేశ్…
Read more