ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 కు గాను అర్షియా 458 మార్కులు, జయాశ్రీ 453 మార్కులు, హసీద్ 450 మార్కులు, ఈశ్వర్ 446 మార్కులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలల మాదిరిగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ గారు అభినందించారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్. పి.నారాయణ ఆలోచనలతో స్థాపించబడి, ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న మునిసిపల్ జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను అభ్యసించవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేశారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించి మునిసిపల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న లెక్చరర్స్ ను ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు.
ఇంటర్మీడియట్ మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థుల ప్రతిభ
Related Posts
కార్వేటినగరంలో అక్రమంగా క్వారీ… 3 కోట్ల పన్నుల ఎగవేత !
ప్రశ్నించినా, సహకరించక పోయిన బెదిరింపులు! నిగ్గు తేలని విషయాలు ఎన్నెన్నో !ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలంలో క్వారీ లీజును అక్రమంగా పొందిన సంఘటన పెద్ద సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా, ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో రాజకీయ మరియు వివిధ శాఖల తో గల పరిచయాలు మరియు లోపలి అవినీతి వలన లాభం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ…
Read moreగంజాయిని నిర్మూలించేందుకు బహుముఖ ప్రణాళికల అమలు :విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి
పిట్ ఎన్.డి.పి.ఎస్. చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలిగజపతినగరం సర్కిల్ వార్షిక తనిఖీలు ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): గంజాయిని నిర్మూలించేందుకు బహుముఖ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన గజపతి నగరం సర్కిల్ కార్యాలయ సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా…
Read more