ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 కు గాను అర్షియా 458 మార్కులు, జయాశ్రీ 453 మార్కులు, హసీద్ 450 మార్కులు, ఈశ్వర్ 446 మార్కులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలల మాదిరిగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ గారు అభినందించారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్. పి.నారాయణ ఆలోచనలతో స్థాపించబడి, ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న మునిసిపల్ జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను అభ్యసించవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేశారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించి మునిసిపల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న లెక్చరర్స్ ను ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు.
ఇంటర్మీడియట్ మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థుల ప్రతిభ
Related Posts
జిల్లాను సమర్థవంతంగా పనిచేసి ప్రగతి పథంలో నిలపండి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు జిల్లాలో ఒకే రోజు 26 మందికి పదోన్నతులు ప్రభాతదర్శిని ( నెల్లూరు – ప్రతినిధి):నెల్లూరు జిల్లాలో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రగతి పథంలో నిలపాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 26 మందికి సీనియర్ అసిస్టెంట్ నుండి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గా పదోన్నతి, వివిధ హోదాలో పదోన్నతులు కల్పిస్తూ.. పదోన్నతుల ప్రొసీడింగ్స్ ను కలెక్టర్…
Read moreఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీలో శ్రీకాళహస్తి పాత్రికేయులకు చోటు
ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ శ్రీకాళహస్తి నియోజకవర్గ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. స్థానిక శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శనివారం జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వళిగలం గోపి, జిల్లా కన్వీనర్ తులసీ రామ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కావేరిపాకం వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా పెరిమిడి…
Read more