ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగంలో 470 కు గాను అర్షియా 458 మార్కులు, జయాశ్రీ 453 మార్కులు, హసీద్ 450 మార్కులు, ఈశ్వర్ 446 మార్కులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిచారు. కార్పొరేట్ కళాశాలల మాదిరిగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ గారు అభినందించారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్. పి.నారాయణ ఆలోచనలతో స్థాపించబడి, ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న మునిసిపల్ జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను అభ్యసించవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేశారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించి మునిసిపల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్న లెక్చరర్స్ ను ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు.
ఇంటర్మీడియట్ మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థుల ప్రతిభ
Related Posts
కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ని విమర్శించే అర్హత కూటమి నేతలకు లేదు- పెళ్ళకూరు వైసీపీ జడ్పిటిసి సభ్యులు నన్నం ప్రిస్కిల్లా
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ని విమర్శించే అర్హత కూటమి పార్టీ నాయకులకు లేదని పెళ్లకూరు మండల జడ్పిటిసి సభ్యులు నన్నం ప్రిస్కిల్లా అన్నారు.శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనేకమంది కార్యకర్తలకు రాజకీయ ఓనమాలు నేర్పి తిరుగులేని నేతగా ఎదిగిన వైసీపీ నేత కామిరెడ్డి…
Read moreచంద్రబాబు స్వార్థ రాజకీయాలకు దేవుణ్ణి అడ్డుపెట్టుకుంటున్నారు -మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయ డ్రామాకు తెర లేపారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన తిమ్మాజీ కండ్రిక వద్ద స్వర్ణముఖి నది తీరాన వెలసి ఉన్న శ్రీ అభయా అనుగ్రహ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థానిక వైసీపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
Read more