ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు పర్య వేక్షణలో నేటి నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. మొత్తం 88 కళాశాలల విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం మొత్తం 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 48మంది పరిశీలకులను, రెండు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.యూజి రెండో సెమిస్టర్ పరీక్షలు సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ఆయా కళాశాలల ప్రధానాచార్యులు,చీఫ్ సూపరింటెండెంట్లు,యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులకు సహకరించాలని డాక్టర్ పద్మజ విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి ఏకేయూ డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు….– పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
Related Posts
బ్రహ్మోత్సవాలకు యాడ్స్ నిర్ణయించేది ప్రెస్క్లబ్ సభ్యులా?
మీడియా ముసుగులో కమీషన్లకు కక్కుర్తిపడి సిఫారసులు చేసిన దళారులుఈవో గారు… పిఆరఓ ఎందుకు ఉన్నట్లు ?వార్తలు కవర్ చేసే రిపోర్టర్ల ఎవరో తెలుసుకోలేని దుస్థితిలో ఈవో ఉన్నారా?(నన్నూరు.శ్రీనివాసరావు, ఎడిటర్, ప్రభాతదర్శిని): శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల ప్రకటనల జారీలో కొత్త విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు పబ్లిసిటీ కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు (యాడ్స్) జారీ చేసే విషయంలో స్థానికంగా ఉన్న ప్రెస్ కమిటీ…
Read moreశ్రీకాళహస్తీశ్వరా బ్రహ్మోత్సవాల ప్రకటనల జారీలో…‘రెగ్యులర్టీ నిబంధనలకు పంగనామాలు’
పరపతి ఉన్నవారికే శ్రీకాళహస్తీశ్వరా స్వామి యాడ్లు?అర్హతలేని మీడియా సంస్థలకు యాడ్స్ ఇవ్వాలని పాలక మండలి సభ్యులు చెప్పారా?సొంత సొమ్ములా స్వామి సొమ్మును దోచి పెడుతున్నకార్యానిర్వాహణాధికారి బాపిరెడ్డిప్రశ్నిస్తే పొంతనలేని విచిత్ర,వింత సమాధానాలునన్నూరు శ్రీనివాసరావు,(ప్రభాతదర్శిని, సంపాదకులు): దక్షిణ కాశీ గా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల మీడియా ప్రకటనల జారీలో ఆలయ కార్యనిర్వహణా ధికారి బాపిరెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పంగనామాలు పెడుతున్నారు. స్వామివారి సొమ్మును సొంత సొమ్ముగా…
Read more