ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో బి నందిని 934 మార్కులు, బైపిసి లో షకీలా 963 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్, బైపీసీలో 11మంది 900 మార్కులు పైన, ఎంపీసీలో ఒకరు 900 మార్కులుపైన సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో తొమ్మిది మంది, బైపీసీలో ఐదు మంది 400 మార్కులు పైన సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.రౌతు రమోల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల కృషి ఫలితమే ఇంటర్మీడియట్ ఫలితాలని ఆమె తెలిపారు.
ఇంటర్ లో పుదూరు గురుకులం విద్యార్థుల హవా
Related Posts
నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్ల తొలి గ్రీవెన్స్ డే అర్జీకి న్యాయం జరిగింది
కావలి రమా జ్యోతికి ఇల్లు వచ్చిందయ్యా…! కృతజ్ఞతతో కలెక్టరేట్కు వచ్చిన వృద్ధురాలుప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):“అర్జీ ఇచ్చామా… పని అయిపోయిందా… వెళ్ళిపోయామా” అన్న భావనకు భిన్నంగా, తన సమస్యను పరిష్కరించిన అధికారులకు ధన్యవాదాలు చెప్పేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్కు రావడం విశేషంగా నిలిచింది. ప్రజల అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతుందనే భావన ఉన్న నేపథ్యంలో, ఒక వృద్ధురాలి కృతజ్ఞతాభావం జిల్లా యంత్రాంగంపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచింది. హిమాన్షు శుక్ల నెల్లూరు…
Read moreన్యాయ సేవ కోసం కోర్టు తలుపులు తట్టే ప్రతి వ్యక్తికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులదే
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ప్రభాతదర్శిని, (తిరుపతి – ప్రతినిధి):న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే వేలాది మందికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులందరి పై ఉందని గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, భారత…
Read more