ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ రాధాకృష్ణన్ కు టిటిడి అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టిటిడి అధికారులు గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఆలయం వెలుపల గవర్నర్ కు బిజెపి నాయకుల గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బిజెపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బిజెపి తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బిజెపి యువమోర్చా నాయకులు దీపక్ యాదవ్ ,జయంత్ కుమార్, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లారపు రవిప్రసాద్ ,బిజెపి తిరుచానూరు నాయకులు మనీ తదితరులు పాల్గొన్నారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సేవలో గవర్నర్ రాధాకృష్ణన్
Related Posts
చెరువులను గుల్ల చేస్తూ…వెంచర్లకు అక్రమంగా గ్రావెల్ తరలింపు
అవినీతిలో పెళ్ళకూరు ఇరిగేషన్ ఏ.ఈ.రూటే సపరేట్… చెరువుమట్టిని మింగేస్తున్న అవినీతి తిమింగలం ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈ రూటే సపరేట్ గా ఉంది. చెరువుల అభివృద్ధికి కృషి చేయవలసిన ఆ అధికారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువులో మట్టిని మింగేస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను స్వామి భక్తితో ఆకట్టుకుంటూ పెళ్లకూరు మండలంలోని వివిధ చెరువులో మట్టిని…
Read moreఅడుగుకోక గతుకు…ఏమౌతుందో బ్రతుకు…
అధ్వాన్నంగా కోట ఆర్ అండ్ బి రోడ్లు…నిద్రావస్థలో అధికారులు…. పాలకులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రాజకీయ పరిభాషలో కోట – వాకాడు మండలాలు రాజకీయాల నిలయంగా ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు రవాణాకు సరైన మార్గాలు లేని రోజులలో కోట వాకాడు నుండి రాజకీయాలు నడిపిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయా ప్రాంతాల అభివృద్ధికి వారి వారి స్థాయిలో ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా…
Read more