ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):గూడూరు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులుగా హైపర్ ఛానల్ రిపోర్టర్ (సచిన్) వి నాగేంద్ర, (టీవీ-5 )ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కాలనీలో హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ అధ్యక్షులుగా వి నాగేంద్ర,ప్రధాన కార్యదర్శిగా బొలిగర్ల వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శిగా (ఐ న్యూస్ )గూడూరు డివిజన్ రిపోర్టర్ కే సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా యాక్ట్ ఛానల్ రిపోర్టర్ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా గూడూరు డివిజన్ మహా న్యూస్ రిపోర్టర్ అల్తాఫ్, ప్రజాబంధం దినపత్రిక ఎడిటర్ మీజూరు మల్లికార్జున్ , న్యాయ సలహాదారుగా గూడూర్ డివిజన్ (ఏబీఎన్) ఛానల్ రిపోర్టర్ పి రమేష్, కార్యవర్గ సభ్యులుగా గూడూరు డివిజన్ ( 10 టీవీ) రిపోర్టర్ మందా ప్రభుదాస్, గూడూరు డివిజన్(6టీవీ) రిపోర్టర్ రఘు, ఉదయం దినపత్రిక గూడూరు డివిజన్ రిపోర్టర్ బాబు మోహన్ దాస్, ఇప్పుడు దినపత్రిక రిపోర్టర్ ఉడుతా శశిధర్ లను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యవర్గ ఎన్నిక సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
గూడూరు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులుగా సచిన్, వెంకటేశ్వర్లు
Related Posts
చెరువులను గుల్ల చేస్తూ…వెంచర్లకు అక్రమంగా గ్రావెల్ తరలింపు
అవినీతిలో పెళ్ళకూరు ఇరిగేషన్ ఏ.ఈ.రూటే సపరేట్… చెరువుమట్టిని మింగేస్తున్న అవినీతి తిమింగలం ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈ రూటే సపరేట్ గా ఉంది. చెరువుల అభివృద్ధికి కృషి చేయవలసిన ఆ అధికారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువులో మట్టిని మింగేస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను స్వామి భక్తితో ఆకట్టుకుంటూ పెళ్లకూరు మండలంలోని వివిధ చెరువులో మట్టిని…
Read moreఅడుగుకోక గతుకు…ఏమౌతుందో బ్రతుకు…
అధ్వాన్నంగా కోట ఆర్ అండ్ బి రోడ్లు…నిద్రావస్థలో అధికారులు…. పాలకులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రాజకీయ పరిభాషలో కోట – వాకాడు మండలాలు రాజకీయాల నిలయంగా ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు రవాణాకు సరైన మార్గాలు లేని రోజులలో కోట వాకాడు నుండి రాజకీయాలు నడిపిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయా ప్రాంతాల అభివృద్ధికి వారి వారి స్థాయిలో ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా…
Read more