ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ఓజిలి పోలీస్టషన్ లో ఎస్ ఐ రవిబాబు ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల విషయంపై నాయకులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజలు సహకరించారని, అదేవిధంగా ఎన్నికల ఫలితాలు వెలువడే సందర్భంలో కూడా ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారని వాటి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి, సోదర భావంతో కలిసిమెలిసి జీవించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కవింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ 4 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రతి ఒక్కరు 144 సెక్షన్ అనుసరించి నడుచుకోవాలని సూచించారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఎవరు కూడా ఏ ఒక్కరిని లక్ష్యంగా చేసుకొని రెచ్చ కొట్టే ప్రయత్నాలు చేయరాదన్నారు. అలాగే కక్షలు కార్పణాలు పెంచే విధంగా సామాజిక మధ్యమాలలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్ర పర్యవేక్షణను ప్రతినిత్యం కాపాడుకునేందుకు తమ సిబ్బంది చిత్తశుద్ధితో 24 గంటలు పాటు పహారకాస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శాంతిభద్రతలు తలెత్తితే చోటుచేసుకునే పరిణామాలు, పరిస్థితులు ఇబ్బందులు పై అవగాహన కల్పించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే కఠిన చర్యలు…నాయుడుపేట డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరిక
Related Posts
చెరువులను గుల్ల చేస్తూ…వెంచర్లకు అక్రమంగా గ్రావెల్ తరలింపు
అవినీతిలో పెళ్ళకూరు ఇరిగేషన్ ఏ.ఈ.రూటే సపరేట్… చెరువుమట్టిని మింగేస్తున్న అవినీతి తిమింగలం ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈ రూటే సపరేట్ గా ఉంది. చెరువుల అభివృద్ధికి కృషి చేయవలసిన ఆ అధికారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువులో మట్టిని మింగేస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను స్వామి భక్తితో ఆకట్టుకుంటూ పెళ్లకూరు మండలంలోని వివిధ చెరువులో మట్టిని…
Read moreఅడుగుకోక గతుకు…ఏమౌతుందో బ్రతుకు…
అధ్వాన్నంగా కోట ఆర్ అండ్ బి రోడ్లు…నిద్రావస్థలో అధికారులు…. పాలకులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రాజకీయ పరిభాషలో కోట – వాకాడు మండలాలు రాజకీయాల నిలయంగా ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు రవాణాకు సరైన మార్గాలు లేని రోజులలో కోట వాకాడు నుండి రాజకీయాలు నడిపిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయా ప్రాంతాల అభివృద్ధికి వారి వారి స్థాయిలో ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా…
Read more