ప్రభాతదర్శిని( గూడూరు ప్రతినిధి): వైసీపీ బలోపేతానికి తన వంతు కృషిచేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు అహర్నిశలు కృషి చేస్తారని నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులు ఊ టుకూరు యామిని రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, తనదైన ముద్ర వేస్తున్న యువ నాయకురాలు ఊటుకూరు యామిని రెడ్డి గారికి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. నెల్లూరు జిల్లా వైసీపీ మహిళా విభాగ వైస్ ప్రెసిడెంట్‌గా ఆమె నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల జిల్లాలోని మహిళలు మరియు పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే నెల్లూరు జిల్లా విభాగ మహిళా వైస్ ప్రెసిడెంట్ దక్కించుకోవడం యామిని గారు పార్టీకి చేసిన నిరంతర సేవలకు నిదర్శనం. పార్టీ పట్ల ఆమెకున్న నిబద్ధతను గుర్తించి అధిష్టానం ఈ బాధ్యతను కట్టబెట్టింది. పార్టీలోని కీలక సీనియర్ నాయకులతో మరియు అధిష్టానంతో ఊటుకూరు యామిని రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందరినీ కలుపుకుని పోయే స్వభావం పార్టీ బలోపేతానికి తోడ్పడుతోంది. జిల్లాలో మహిళలను పార్టీ వైపు ఆకర్షించడంలో, వారిని చైతన్యపరచడంలో యామిని ఎప్పుడూ ముందుంటారు. ఏ కార్యక్రమమైనా తనదైన శైలిలో విజయవంతం చేస్తూ నాయకత్వ ప్రశంసలు అందుకుంటున్నారు.