ప్రభాతదర్శిని, (నెల్లూరు – ప్రతినిధి) :..యోగి వేమన తన సరళమైన పద్యాల ద్వారా సత్యం, నైతికత, సమానత్వం, మానవత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన నిలిచారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో యువజన సర్వీసుల శాఖ,( సెట్నెల్) వారి ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ యోగి వేమన బోధనలు సమాజానికి మార్గదర్శకాలని అన్నారు. వేమన రచించిన యోగి వేమన శతకం, తత్త్వ శతకంలలోని భావాలు నేటి సమాజానికి అత్యంత ముఖ్యమని, యువత వాటిని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. యోగి వేమన తన బోధనల ద్వారా తెలుగు సాహిత్యంలో, సమాజ చైతన్యంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసి మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్వో విజయకుమార్, సెట్నెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.