సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ రావు ప్రభాతదర్శిని, (రేణిగుంట-ప్రతినిధి): విద్యార్థులు అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ రావు కోరారు. బుధవారం ఆయన రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిఎం శ్రీ పాఠశాలలో కిచెన్ గార్డెన్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించారు. తరగతి గదుల నిర్మాణం పై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తరగతులను జరిపించడానికి తగిన ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా సూచించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులతో త్వరలో జరగబోయే పబ్లిక్ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. పీఎం శ్రీ నిధుల ద్వారా పాఠశాలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలకు ఎంత ఖర్చు చేశారో ఇంకా ఏ పనులు పెండింగ్లో ఉన్నవో వివరాల కోసం సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సారధి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామల, పిజి టీచర్ మోహన్ నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.