వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించి సంకెళ్లతో తీసుకెళ్లడం చూస్తుంటే సరిగ్గా 22- 23 ఏళ్ళ క్రితం ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్‌పై దాడి చేసి, ఆ తర్వాత ఉరితీసిన అమెరికా దుశ్చర్య గుర్తుకు వస్తుంది. సద్దాం జీవాయుధాలు తయారు చేస్తున్నాడనే ఆరోపణతో యుద్దానికి దిగిన అమెరికా అందుకు ఎటువంటి ఆనవాళ్లను ఇప్పటివరకు చూపలేకపోయింది. ఇప్పుడు కూడా అమెరికా వెనెజువెలాపై దాడి చేయడానికి అసలు కారణం 1974లో సౌదీఅరేబియాతో హెన్రీ కిస్సింజర్ చేసుకున్న ఒప్పందం. ఇది వాస్తవానికి అమెరికా డాలర్ మనుగడ గురించి అని మాత్రం స్పష్టం అవుతుంది. ట్రంప్ చెబుతున్నట్లు మాదకద్రవ్యాలు, ఉగ్రవాదం, ప్రజాస్వామ్యం వంటి కారణాలు ఏవీకావు.ఇది 50 సంవత్సరాలుగా అమెరికాను ఆధిపత్య ఆర్థికశక్తిగా ఉంచిన పెట్రోడాలర్ వ్యవస్థను కాపాడుకోవడం కోసమే అని గ్రహించాలి. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్‌ను కూడా తమ మాట వినకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం గమనార్హం. అమెరికా బెదిరించి, బలప్రయోగం చేసి డాలర్లతో అంతర్జాతీయ వాణజ్యం జరిగేటట్లు చూస్తూ ప్రపంచంలో సంపన్న దేశంగా చెలామణి అవుతుంది. ఎప్పుడైతే యూరోలో చమురు వాణజ్యం చేస్తానని సద్దాం ప్రకటించారో తన ఆర్ధిక వ్యవస్థ కూలిపోతుందని అమెరికా భయపడింది. ఇపుడు కూడా మదురో ఇతర కరెన్సీలలో చమురు వాణిజ్యం చేయడం ప్రారంభించింది అమెరికా భయపడిపోయింది. అందుకనే వెనిజులాను అంతం చేస్తామని ట్రంప్ బెదిరించారు. వెనిజులాలో 303 బిలియన్ బారెల్స్ నిరూపితమైన చమురు నిల్వలు ఉన్నాయి. సౌదీ అరేబియా కంటే ఎక్కువ. మొత్తం ప్రపంచ చమురులో 20 శాతం. వెనెజులా ఆ చమురును చైనీస్ యువాన్‌లో చురుకుగా అమ్ముతోంది. డాలర్లలో కాదు. 2018లో వెనెజువెలా డాలర్ నుండి విముక్తి పొందుతామని ప్రకటించింది. వారు యువాన్, యూరోలు, రూబిళ్లు, చమురుకు డాలర్లు తప్ప మరేదైనా అంగీకరించడం ప్రారంభించారు.పైగా, బ్రిక్స్‌లో సభ్యతం కోసం దరఖాస్తుకు సిద్ధమయ్యారు. స్విఫ్ట్‌ను పూర్తిగా దాటవేస్తూ చైనాతో ప్రత్యక్ష చెల్లింపు మార్గాలను నిర్మిస్తున్నారు. వారు దశాబ్దాలుగా డాలర్ ఆధిపత్యం తొలగించేందుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి తగినంత చమురు నిల్వలు వారి వద్ద ఉన్నాయి. మొత్తం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పెట్రోడాలర్ పై నిర్మించారని గుర్తించాలి. చమురు వ్యాపారం డాలర్లతో జరగకపోతే అమెరికా ఆర్ధిక వ్యవస్థ కూలిపోతుంది. అందుకనే, 1974లో, హెన్రీ కిస్సింజర్ సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన అన్ని చమురు ధరలను అమెరికా డాలర్లలో నిర్ణయించే విధంగా అవగాహనకు వచ్చారు. అందుకు బదులుగా, అమెరికా ఆ దేశానికి సైనిక రక్షణను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్లకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించింది. భూమిపై ఉన్న ప్రతి దేశానికి చమురు కొనడానికి డాలర్లు అవసరం.ఇది అమెరికా అపరిమిత డబ్బును ముద్రించడానికి అనుమతిస్తుంది. ఆ నిధులతోనే సైన్యానికి నిధులు సమకూరుస్తుంది. సంక్షేమ రాజ్యం. లోటు వ్యయం. పెట్రోడాలర్ సైనిక విమానాలకంటే అమెరికా ఆధిపత్యానికి చాలా ముఖ్యంగా మారింది. అందుకనే దానిని సవాలు చేసే నేతలను అమెరికా సహింపలేదు. 2000లో సద్దాం హుస్సేన్ ఇరాక్ డాలర్లకు బదులుగా యూరోలలో చమురును విక్రయిస్తుందని ప్రకటించాడు.2003 నాటికి అమెరికా ఆ దేశాన్ని ఆక్రమించుకుంది.ఇరాక్ చమురు వెంటనే డాలర్లకు తిరిగి మారింది. సద్దాంను కొట్టి చంపారు. 2009లో చమురు వ్యాపారం కోసం గడాఫీ గోల్ దినార్ అని పిలువబడే బంగారు మద్దతుగల ఆఫ్రికన్ కరెన్సీని ప్రతిపాదించాడు.హిల్లరీ క్లింటన్ స్వయంగా లీక్ అయిన ఇ మెయిల్‌లు జోక్యానికి ఇది ప్రధాన కారణమని నిర్ధారిస్తాయి. ఇ మెయిల్‌లో ఈ బంగారం లిబియా బంగారు దినార్ ఆధారంగా పాన్ -ఆఫ్రికన్ కరెన్సీని స్థాపించడానికి ఉద్దేశించబడింది. 2011లో నాటో లిబియాపై బాంబులు వేసింది. గడాఫీని లైంగికంగా హింసించి హత్యచేశారు. లిబియాలో ఇప్పుడు బానిసమార్కెట్లు తెరిచి ఉన్నాయి.మేము వచ్చాము, మేము చూశాము, అతను చనిపోయాడు! క్లింటన్ కెమెరా ముందు నవ్వాడు. బంగారు దినార్ అతనితోపాటు మరణించింది. ఇప్పుడు మదురో. సద్దాం,గడాఫీలు ఇద్దరి వద్ద కంటే ఐదురెట్లు ఎక్కువ చమురుతో యువాన్‌లో చురుకుగా అమ్ముతున్నారు.డాలర్ నియంత్రణ వెలుపల చెల్లింపు వ్యవస్థలను నిర్మించడంతోపాటు బ్రిక్స్‌లో చేరాలని దరఖాస్తు చేసుకున్నాడు. డాలర్ ఆధిపత్యాన్ని కట్టడి చేసేందుకు నాయకత్వం వహిస్తున్న చైనా, రష్యా, ఇరాన్‌లతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాడు.ఇది యాదృచ్చికం కాదు.పెట్రోడాలర్‌ను ఎవ్వరు సవాల్ చేసినా వారు సమాధి కావాల్సిందే. స్టీఫెన్ మిల్లర్ (అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సలహాదారు) రెండు వారాల క్రితం బిగ్గరగా ఇలా అన్నారు: అమెరికన్ చెమట,చాతుర్యం,శ్రమ వెనిజులాలో చమురు పరిశ్రమను సృష్టించాయి.దాని నిరంకుశ దోపిడీ అమెరికన్ సంపద,ఆస్తిపై నమోదైన అతిపెద్ద దొంగతనం. వెనిజులా చమురు అమెరికాకు చెందిందని నిస్సిగ్గుగా బహిరంగంగా చెబుతున్నారు. ఎందుకంటే అమెరికా కంపెనీలు దీనిని 100 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేశాయి.ఈ తర్కం ప్రకారం, చరిత్రలో ప్రతి జాతీయం చేసిన వనరు దొంగతనం. కానీ ఇక్కడ లోతైన సమస్య ఉంది. పెట్రోడాలర్ ఇప్పటికే చనిపోతోంది. రష్యాఉక్రెయిన్ నుండి రూబిళ్లు, యువాన్లలో చమురును విక్రయిస్తుంది. సౌదీ అరేబియా బహిరంగంగా యువాన్ సెటిల్మెంట్ల గురించి చర్చిస్తుంది. ఇరాన్ సంవత్సరాలుగా నాన్-డాలర్ కరెన్సీలలో వ్యాపారం చేస్తోంది. చైనా 185 దేశాలలో 4,800 బ్యాంకులతో స్విఫ్ట్‌కు తమ స్వంత ప్రత్యామ్నాయమైన సిప్స్‌ని నిర్మించింది. బ్రిక్స్ డాలర్‌ను పూర్తిగా దాటవేసే చెల్లింపు వ్యవస్థలను చురుకుగా నిర్మిస్తోంది.ఎంబ్రిడ్జ్ ప్రాజెక్ట్ కేంద్ర బ్యాంకులు స్థానిక కరెన్సీలలో తక్షణమే లావాదేవీలను పరిష్కరించడానికి అనుమతిస్తుంది. 303 బిలియన్ బ్యారెళ్ల చమురుతో వెనిజులా బ్రిక్స్‌లో చేరడం వల్ల ఇది విపరీతంగా వేగవంతం అవుతుంది ప్రస్తుతం అమెరికా సైనిక దాడి కేవలం డాలర్ అస్తిత్వానికి ఎదురవుతున్న ఈ ప్రమాదం కారణంగానే జరిగిందని స్ఫష్టం అవుతుంది. దకద్రవ్యాలను ఆపకపోవడం అన్నది కేవలం ఓ సాకు మాత్రమే. వెనెజువెలా అమెరికా కొకైన్‌లో 1 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉంది.పైగా,మదురో ఉగ్రవాద సంస్థను నడుపుతున్నాడని ఎటువంటి ఆధారాలు లేవు. ఎన్నికలు లేని సౌదీ అరేబియాకు మద్దతు ఇస్తున్న అమెరికా ప్రజాస్వామికంగా ఎన్నికైన మదురోను కూల్చడం వెనుక ఆర్ధిక ప్రయోజనాలే బలీయంగా ఉన్నాయని స్పష్టం అవుతుంది. అయితే చరిత్ర గతి ఎప్పుడూ ఒకే విధంగా ఉండబోదని అమెరికా గ్రహించాలి.అంతర్జాతీయంగా నానాటికీ అమెరికా ఒంటరి అవుతూ ఉండగా, సరికొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి. ఐరోపా యూనియన్ సైతం అమెరికా ఉనికి చూసి నేడు అప్రమత్తం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. బ్రిక్స్ సమీకరణాలు ఒకవైపు, చైనా,- రష్యా మరోవైపు బలమైన ప్రతిఘటన ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి.