
నాయుడు పేట ఏఎంసీ చైర్మన్ గా విజయ్ కుమార్ నాయుడు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉండి కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకులకు తగిన గుర్తింపు గౌరవం రాజకీయ అవకాశాలు కల్పించే దశగా టిడిపి యువ నేత నారా లోకేష్ బాబు శ్రీకరం చుట్టారు. కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల పందారానికి తెరతీరడంతో టిడిపి, జనసేన, బిజెపి నాయకులలో ఆశలు చిగురించాయి. కూటమిలోనే ప్రధాన పార్టీ అయిన టిడిపిలో నామినేటెడ్ పదవులు చేజిక్కించుకునేందుకు నాయకులు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేని విధంగా ఈసారి నామినేట్ పదవులు పార్టీ అభివృద్ధి కోసం కష్టకాలంలో టిడిపి నాయకులను కార్యకర్తలను వెన్నంటి ఉన్న నాయకులు కట్టపెట్టేందుకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు టిడిపి అధిష్టానం గత ఎన్నికల ముందే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికలలో అనుకోని విధంగా కూటమి ఏర్పడడంతో ఎక్కువ పదవులు దక్కే అవకాశం టిడిపికి ఉన్నప్పటికీ పొత్తుల భాగంగా కొన్ని నామినేటెడ్ పదవులు కోల్పోవలసి వచ్చిన, మిత్రధర్మం పాటించాలన్న త్రికరణశుద్ధితో టిడిపి యువనేత నా లోకేష్ మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులను కేటాయించిన విషయం తెలిసిందే. టిడిపి వాటాకు సంబంధించిన నామినేటెడ్ పదవులను పార్టీ కోసం పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇచ్చారు. నామినేటెడ్ పదవులు ఇచ్చే క్రమంలో అవకాశవాద నాయకులకు కాకుండా, పార్టీని అంటూ పెట్టుకుని ఉన్నవారికి ఆగ్ర తాంబూలం వేస్తున్నారు. నామినేటెడ్ పదవులు పొందే వ్యక్తులు పార్టీలో ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు… కష్టకాలంలో పార్టీకి ఎలాంటి సేవలు చేశారు. టిడిపిలో వారి కుటుంబ సభ్యుల పాత్ర ఏంటి? అవకాశవ రాజకీయాలు చేసి ఉన్నారా లేదా అనే విషయాలను అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఇలాంటి అంశాలను పట్టించుకోకపోవడంతో టిడిపిని అంటిపెట్టుకొని ఉన్న చాలామంది నాయకులు రాజకీయంగా ఎదగలేక, ఆర్థికంగా చితికి పోయిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత 20 సంవత్సరాలుగా వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీని దీర్ఘకాలికంగా అంటిపెట్టుకొని ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుల వివరాలను గత ఎడాది లోకేష్ బాబు చేసిన యువగళం పాదయాత్రలో సేకరించినట్లు తెలుస్తోంది. యువగళం పాదయాత్రలో పూర్వపు వెంకటగిరి నియోజకవర్గం లోను, నేడు సూళ్లూరుపేట నియోజకవర్గంలోనూ టిడిపి అధ్యక్షుడిగా కన్వీనర్ గా దీర్ఘకాలిక పనిచేసిన ఓజిలి మండలం, పున్నేపల్లి గ్రామానికి చెందిన గుజ్జులపూడి విజయ్ కుమార్ నాయుడు పేరు ప్రస్తావనకు రావడం, అవకాశవద రాజకీయాలు చేయకుండా ఉండడం, విజయ్ కుమార్ నాయుడు తండ్రి, కుటుంబీకులకు కూడా టిడిపి అభివృద్ధికి పాటుపడినట్లు లోకేష్ బాబు కు నివేదిక అందినట్లు సమాచారం. దీనికి తగ్గట్టుగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న విజయ్ కుమార్ నాయుడు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయాన్ని కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఓజిలి మండలంలో విజయ్ కుమార్ నాయుడు తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొందరు వ్యక్తులు కూడా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన విజయ్ కుమార్ టిడిపిని అంటిపెట్టుకొని ఉన్న ఏ మాత్రం రాజకీయ ఉన్నత పదవులు అందుకొరకు లేదు. అలాగే ఆర్థికంగా ఎదగలేదు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొందరు రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురిచేసిన అటువైపు కన్నెత్తి చూడకుండా టిడిపిని అంటిపెట్టుకొని తన నిబద్ధతను చాటుకోవడంపై విజయ్ కుమార్ నాయుడు టిడిపి అధినేతకు మరింత చేరువయ్యాడు. ఈ పరిణామం విజయకుమార్ నాయుడుకు నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం వచ్చింది. నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఓజిలి, నాయుడుపేట, పెళ్ళకూరు మండలాల పరిధిలో ఉంది. ఆయా మండలాలలో ఇప్పటికే కొందరు ఏఎంసి పదవిని పొందిన విషయం తెలిసిందే. ఈసారి ఓజిలి మండలానికి ఏఎంసీ పదవిని కేటాయించాలని టిడిపి అధిష్టానం ఖరారు చేసినట్లు రాజధాని సమాచారం. ఈ మూడు మండలాల పరిధిలో దీర్ఘకాలికంగా టిడిపికి అధ్యక్షుని హోదాలో సేవలు అందించినది కూడా విజయ్ కుమార్ నాయుడు కావడంతో నాయుడుపేట ఏఎంసీ పదవిని విజయకుమార్ నాయుడుకు కేటాయించినట్లు విశ్వాసనీయ సమాచారం. ఓజిలి మండలంలో తెలుగుదేశం పార్టీకి వివిధ సందర్భాలలో విజయకుమార్ నాయుడు చేసిన సేవలు గుర్తింపుగా ఈ పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ కష్ట కాలంలో కార్యకర్తలను అందుబాటులో ఉంటూ తన పరిధిలో సమస్యలను పరిష్కరించడం, పార్టీ అధిష్టానం ఇచ్చిన ఏ కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టకుండా విజయవంతం చేయడం, లోకేష్ బాబు చేపట్టిన యువ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, గత ఎన్నికలలో టిడిపి అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి డాక్టర్ నెలవల విజయ్ శ్రీ గెలుపులో కీలక పాత్ర పోషించడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని నాయుడుపేట ఏఎంసి చైర్మన్ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయం ధ్రువీకరించినప్పటికీ విజయ్ కుమార్ నాయుడు టిడిపికి దీర్ఘకాలికంగా చేసిన సేవలకు ఈ పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 20 సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీకి చేసిన కష్టానికి ఫలితంగా, పార్టీ విధేయతకు పట్టంగా ఈ పదవి విజయకుమార్ నాయుడుకు దక్కటంపై నియోజకవర్గంలోని పలువురు నాయకులు కార్యకర్తలు ఇప్పటికే హర్షం వ్యక్తం చేయడం విశేషం. టిడిపి ని బలోపేతం చేసే క్రమంలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని లోకేష్ బాబు చేసి టిడిపి కుటుంబ సభ్యులకు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వారి కుటుంబం నష్టపోకుండా టిడిపి బీమా పథకాన్ని లోకేష్ తీసుకొచ్చి నాయకులు శ్రేణులకు అభయం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే లోకేష్ మరో అడుగు ముందు ముందుకేసి పార్టీని నమ్ముకొని ఆర్థికంగా చితికిపోయిన సీనియర్ నాయకులను కార్యకర్తలను ఆదుకునే క్రమంలో వారి సీనియార్టీని, సిన్సియార్టీని బట్టి పార్టీ నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంలో ఇప్పటికే టిడిపి శ్రేణులు సీనియర్ నాయకుల ద్వారా అభినందనలు పొందుతున్న విషయం తెలిసిందే.
