ప్రభాతదర్శిని (చిత్తూరు-ప్రతినిధి): చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం నుండి బైకులో మదనపల్లికి నాటు సారా తెస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మదనపల్లె ఎక్సైజ్ సిఐ భీమ్ లింగ తెలిపారు. సీఐ కథనం… పుంగనూరు మండలం, సుగాలి మిట్ట సమీపంలోని నల్లగుట్ట తండా కు చెందిన రమేష్ నాయక్(30) తన స్కూటీలో 40 లీటర్ల నాటు సారా, అదే ఊరికి చెందిన అతని స్నేహితుడు మరో బైక్ లో 40 లీటర్ల నాటు సారా తీసుకుని మదనపల్లికి ఒకరి వెనకాల ఒకరు వస్తూ ఉన్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. వెంటనే తనతో పాటు ఎస్ఐ లు డార్కస్, జబీ ఉల్లా సిబ్బంది వెళ్లి చండ్రమాకులపల్లి క్రాస్ లోని 150మైళ్ల వద్ద వాహణాల తనిఖీలలో రమేష్ నాయక్ పట్టు బడగా, మరొకరు పరారయ్యారని సీఐ తెలిపారు. పట్టుబడ్డ నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నాటుసారా, బైకును సీజ్ చేసామన్నారు అలాగే నిందితుడు వదిలేసి వెళ్లిన బైక్ నాట్సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామని తెలిపారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.