ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ సందేశం మేరకు మన తిరుపతి జిల్లాలోని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల అధికారులు అందరూ సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుండి అందిన సందేశం మేరకు తిరుపతి జిల్లాలో అక్టోబర్ 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అందరు మండల రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్ అండ్ బి, అగ్రికల్చర్, పంచాయతీరాజ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తదితర సంబంధిత శాఖల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బియ్యము, కందిపప్పు తదితరాలు తగినంత స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ వారు జనరేటర్లు అందుబాటులో ఉండేలా, అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు, పూరి గుడిసెలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరం మేరకు పునరావాస కేంద్రాలలో తరలించేలా, పునరావాస కేంద్రాలను గుర్తించి తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ వారు పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే అందరు జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని స్థాయిలలో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
14 నుండి 16 వరకు భారీ వర్షాలు.. అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
Related Posts
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బొజ్జల రిషిత రెడ్డి
కరెన్సీ నోట్లతో శ్రీ సత్యమ్మ తల్లి కి అలంకరణ..ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): దసరా నవరాత్రుల్లో భాగంగా రేణిగుంట మండలం భగత్ సింగ్ కాలనీ లో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లికి శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రులలో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం పరిపాటి అయింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్…
Read moreప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి:డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్
ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):చేతి వృత్తులతోనే మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధ్యమని తెలిపారు. శనివారం సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వస్తెనాక్టివ్ వారి సహకారంతో 60 మంది మహిళలకు కలంకారి వర్క్ మీద రెండు బ్యాచ్లుగా శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ వెలుగు) ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు మాట్లాడుతూ ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వెలుగు సంఘాల ద్వారా రుణాలు…
Read more