కాకమ్మ కథలు చెబుతున్న ఓజిలి ఎస్సై ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సోషల్ మీడియా వేదికగా ఆసభ్యకరమైన మెసేజ్లు పెట్టి అవమానపరిచిన సంఘటనపై ఓజిలి మండలం పోలీసులు కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిబ్రవరి నెల 7వ తేదీన పాత కక్ష్యలను దృష్టిలో పెట్టుకొని ఓ రాజకీయ పార్టీ కి చెందిన ఒక వాట్సాప్ గ్రూప్ లో అసభ్యకరమైన నిరాధారణమైన, పోస్టులను ఓ ప్రబుద్ధుడు పోస్ట్ చేశాడు. ఈ విషయమై మనోభావాలు దెబ్బతిన వ్యక్తి ఓజిలి పోలీసులకు, సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు పై చర్యలు తీసుకునేందుకు ఓజిలి మండలం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేసు నమోదు చేసే విషయమై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఓజిలి ఎస్సై కె.స్వప్నను అడిగితే అసభ్యకరమైన నిరాధారణమైన మనోభావాలు దెబ్బతీసే మేసేజ్ లు పై కేసు నమోదు చేసేందుకు వీలులేదని చెప్పుకొచ్చారు. కేసు ఎందుకు నమోదు చేయకూడదో, అందుకు కారణాలు తెలియజేస్తూ ఎండార్స్ మెంట్ ఇవ్వాలని, కోర్టులో తేల్చుకుంటానని, కోరితే, రేపు ఇస్తాను…రెండు రోజులలో ఇస్తాను..అంటూ ఎండార్స్ మెంట్ కనిపించడం లేదని, నెల రోజుల నుండి ఇవ్వకుండా పొంతనలేని, కథలు చెబుతుండడం విశేషం. కేసు నమోదు చేయకుండా, ఎండార్స్ మెంట్ ఇవ్వకుండా, ఎస్ ఐ ఇలా కేసును నీరుగార్చేందుకు వ్యవహరించేందు క్యాష్ కారణమో? క్యాస్ట్ కారణమో? ఆ లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.