ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండ్రిగ-ప్రతినిధి): విజయదశమి సందర్బంగా పల్లమాలలో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ పచ్చాలమ్మ అమ్మవారిని శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు యస్. సి. వి నాయుడు శనివారం దర్శించుకున్నారు.ఈ సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ పచ్చాలమ్మ అమ్మవారి నూతన కల్యాణ మండపం నిర్మాణం చేపడుతున్నట్లు యస్. సి. వి నాయుడుకి ఆలయ నిర్వాహకులు తెలియజేయగా, తన వంతు సహాయంగాపది లక్షలు రూపాయలు విరాళా న్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు యస్. సి. వి నాయుడు ప్రకటించారు. అంతేకాకుండా కల్యాణ మండప నిర్మాణం పూర్తి అయ్యేవరకు సహాయ, సహకారాలు అందిస్థానని తెలియజేసారు.అనంతరం యువతకు భక్తి మార్గం గురించి యస్. సి. వి నాయుడు మార్గదర్శనం చేసారు.ఈ సందర్బంగా యస్. సి. వి నాయుడుతో సెల్ఫీల కోసం యువతపోటీ పడి తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుదర్శన్ నాయుడు, హరిబాబు నాయుడు, కన్నయ్య నాయుడు, ఎక్స్ యం. పి.టి. సి. వీర రాఘవులు, యూనిట్ ఇంచార్జ్ సురేష్, జి. మునస్వామి ఆచారి, వెంకటకృష్ణ, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.