ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని నూతన ఎస్సై కే స్వప్న తెలిపారు. ఓజిలి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవి బాబును అధికారులు విఆర్ఓ బదిలీ చేశారు. వి ఆర్ లో ఉన్న స్వప్నను ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బదిలీ చేశారు. గురువారం ఆమె ఓజిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు. అలాగే సంఘ విద్రోహ శక్తుల ఆగడాలను అరికట్టాలని అన్నారు. శాంతి భద్రత ప్రదర్శన కోసం అధికారులు ప్రజాప్రతినిధులు మీడియా మొదటి తీసుకుంటామని ఆమె తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పోలీసులతో సహకరించాలని ఆమె కోరారు.