గూడూరు లో పోలీస్ స్టేషన్ లలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
ప్రభాతదర్శిని (గూడూరు-ప్రతినిధి): విధుల నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశించారు. గూడూరు ను నెల్లూరు జిల్లా లో విలీనం అయిన తరువాత మొదటి సారిగా గురువారం గూడూరు కి విచ్చేసిన ఎస్పీ పోలీసు స్టేషన్లోని పరిపాలనా వ్యవస్థ, కేసుల నమోదు విధానం, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, పోలీసు శాఖపై విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని సూచించారు.నేరాల నియంత్రణ,రౌడీ షీటర్లు, అనుమానితులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. స్టేషన్లో నమోదైన పెండింగ్ కేసులు, కోర్టు సంబంధిత కేసుల స్థితిగతులు, ఎఫ్ఎఆర్లు,స్టేషన్ హౌస్ రికార్డులు, సీజ్ చేసిన వస్తువుల భద్రత వంటి అంశాలను ఎస్పీ ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో నమోదు చేసి, న్యాయబద్ధంగా విచారణ చేపట్టాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులకు సంబంధించిన కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఈ తనిఖీలో గూడూరు డీఎస్పీ గీతా కుమారి, వన్ టౌన్ సిఐ శేఖర్ బాబు, రూరల్ సి.ఐ కిషోర్ బాబు, ఎస్సైలు మనోజ్ కుమార్, శిరీష తదితరులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.