
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదలు ప్రజల జీవితానికి, ఆస్తికి భారీ స్థాయిలో నష్టాన్ని కలిగించాయని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావితం వల్ల నష్టపోయిన తమ వినియోగదారులకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సత్వర సహాయాన్ని అందించనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ క్లిష్ట సమయాల్లో తన కస్టమర్లు తిరిగి కోలుకోవడానికి సకాలంలో, సమర్థవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లను అందించి వారి పట్ల తమ నిబద్ధతను తెలుపుతున్నట్టు సంస్థ ప్రతినిధి చెప్పారు. ఈ క్లిష్టమైన సమయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందన్నారు. ఈ విపత్తు వలన ప్రభావితమైన వారికి సాధ్యమైనంత సహకారాన్ని అందించడానికి కట్టుబడి ఉందన్నారు. బజాజ్ అలియంజ్తో పాటు ఇన్సూరెన్స్ పరిశ్రమ పౌరులకు, ప్రత్యేకించి సంక్షోభ సమయాల్లో, సేవలు అందించడానికి అంకితం అయిందన్నారు. కస్టమర్లకు సహాయం చేయడానికి, కంపెనీ వేగవంతమైన సమర్థవంతమైన మద్దతును అందించడానికి అనేక చర్యలను చేపట్టిందన్నారు. కస్టమర్ ప్రశ్నలకు సమాధానాలు అందించడానికి ఒక ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయబడిందన్నారు. అవాంతరాలు లేకుండా క్లెయిమ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. కస్టమర్ సపోర్ట్ కోసం అత్యవసర టోల్-ఫ్రీ హెల్ప్లైన్ 1800 209 7072 ఏర్పాటు చేశామని, సులభమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ సదుపాయాన్ని అందించేందుకు బజాజ్ అలియంజ్ తన కస్టమర్లకు షేర్ చేసిన ఎస్ఎంఎస్ అడ్వైజరీలో క్లెయిమ్ రిజిస్ట్రేషన్ లింకులు చేర్చబడ్డాయని చెప్పారు.