త్వరలో మాజీ ఎమ్మెల్యే పై చర్యలు తప్పవు విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం
ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీ కాళహస్తిలోని భూ అక్రమాలపై, భూ బకాసురులపై విచారణ నిరంతర ప్రక్రియ అని, రాజీవ్ నగర్ నుంచి భూ అక్రమాలపై విచారణ ప్రక్రియ మొదలు పెట్టామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ అక్రమాలపై ఇప్పటికే విచారణ ప్రారంభించామన్నారు. అయితే అయితే కొన్ని విమర్శలు రావడంతో రాజీవ్ నగర్ పై విచారణ నిరంతర ప్రక్రియగా మారుస్తామని తెలిపారు. భూవివాదాలపై, అక్రమార్కులపై త్వరలో కొరడా ఝళిపిస్తామని, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే అస్తవ్యస్తంగా ఉన్న ఆలయపాలనను గాడిలో పెట్టామని, బీసీ హాస్టల్, బాలికల హాస్టల్ రూపు రేఖలు మార్చామని తెలిపారు. అలాగే గత ఐదేళ్లలో డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా మారిందని చెప్పారు. అందువల్ల మురికి కాలువలో సిల్టు తొలగింపు కార్యక్రమం చేపట్టమన్నారు.రాజీవ్ నగర్ లో రివర్ వ్యూ లో మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన కొత్త పట్టాలను రద్దు చేసి అర్హులకు అందిస్తామని చెప్పారు. 2004 – 2006 మధ్యలో ఇంటి పట్టాలు పొందిన వారు నేరుగా ఆర్డీవోను కలిసి వారి వివరాలనుతెలియజేయాలన్నారు. అటు టిడ్కో ఇల్లు, రాజీవ్ నగర్ లో ఇంటి పట్టాలన్న వారికి ఏదో ఒకచోట అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. అలా కాకుండా ఒక్కో వ్యక్తి వద్ద ఐదు నుంచి పది ఇంటి పట్టాలు ఉంటే వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. అలాగే కొంతమంది ఇతరులకు అమ్ముకొని ఉంటే వాటిలో ఇల్లు కట్టి ఉంటే ఖచ్చితంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. అలాగే దొంగ పట్టాలు కొని ఇల్లు కట్టి ఉంటే అలాంటి వారికి వారి నుంచి వడ్డీతో సహా వసూలు చేసి ఇస్తామని తెలిపారు. అలాగే గంజాయివిక్రయాలు చేసే వారిని,లాటరీ టికెట్లు అమ్మే వారి భరతం పడతామని హెచ్చరించారు. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మరుగు దొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ ఆదాయాన్ని గణనీయంగా పెంచామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో రవి శంకర్ రెడ్డి, తాహసిల్దార్ లక్ష్మీనారాయణలు కూడా ఉన్నారు.