చైర్మన్ గా శ్రీకాళహస్తి జడ్పిటిసి పేరు పరిశీలన?ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ప్రస్తుత చైర్మన్ శ్రీనివాసులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి శ్రీకాళహస్తి జడ్పిటిసి కి చైర్మన్ పదవిని కట్టబెట్టి ప్రయత్నాలు తెరచాటుగా మొదలైనట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా శ్రీకాళహస్తి జడ్పిటిసి వెంకటసుబ్బారెడ్డికి చైర్మన్ పదవిని కట్టబెట్టే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం మారడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న జడ్పిటిసి లో ఒకరు జడ్పి పీఠం కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. తాజా మాజీ మంత్రి,ప్రస్తుత పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో జిల్లా పరిషత్ చైర్మన్ సీటుపై నీలి నీడలో కమ్ముకుంటున్నాయి. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వున్న శ్రీకాళహస్తి జడ్పిటిసి వెంకటసుబ్బారెడ్డికి జడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. వైసిపి పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపి నేతలపై చేయించిన, చేసిన దాడులు, అక్రమ కేసులు బనాయించిన విషయం తెలిసిందే. దీంతో టిడిపి నాయకులు పెద్దిరెడ్డి ఆదిపత్యానికి అడ్డుకట్ట వేయాలని యోచనలో ఉన్నట్టు సమాచారం. పైగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అంగళ్లు వద్ద దాడి చేయించి తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తెలుగుదేశం లో చేరిన జడ్పిటిసి వెంకటసుబ్బారెడ్డిని జడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు టిడిపి నాయకులు పావులు కదుపుతున్నట్టు సమాచారం. టిడిపి నేతలకు వాస్తవానికి జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పై ఎలాంటి వివక్ష లేకున్నా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై ఉన్న రాజకీయ విభేదాల వల్లే జడ్పీ చైర్మన్ పదవిని టిడిపి జెడ్పీ టి సి వెంకటసుబ్బారెడ్డిని జడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చుని పెట్టేందుకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. వాస్తవం తెలియాలంటే మరికొద్ది రోజులు వేసి చూడాల్సిందే.
మారిన రాజకీయ సమీకరణాలతో…చిత్తూరు జడ్పీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
Related Posts
బాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం….బాలికలను ఎదగనిద్దాం
●కౌమార దశ ఆడపిల్లల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.● అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పసుపులేటి పాపారావు అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా…
Read moreసామాజిక న్యాయాన్కి కట్టుబడి వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడే
మాదిగల కృతజ్ఞత యాత్రలోఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి):సామాజిక న్యాయాన్నికి కట్టుబడి, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటించింది, నేడు వర్గీకరణ చేసింది కూడా చంద్రబాబు నాయుడేనని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ స్పష్టంచేశారు. కర్నూల్ టౌన్ చేరుకున్న ‘చంద్రబాబుకు మాదిగల కృతజ్ఞత’ యాత్ర సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ…
Read more