జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి రెడ్డి
ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):రెవెన్యూ సదస్సులతో దీర్ఘ కాలిక భూ సమస్యలకు పరిష్కారం పేదప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తిరుపతి పార్లమెంటు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు లో రెవిన్యూ సదస్సులు నిర్వహించారు.ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి,టిడిపి నాయకులు కరుణాకర్ రెడ్డి,హేమంత్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రావణి రెడ్డి మాట్లాడుతో దీర్ఘకాలంగా నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా నే ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.ప్రజల వద్దకు అధికారులు వెళ్లి సమస్యల తక్షణ పరిష్కారానికి ఈ సదస్సులను నిర్వహిస్తున్నారని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.గత ప్రభుత్వంలో పేదల భూములను పెద్దలు అక్రమించుకున్నారని వాటిని తీసుకుని పేదలకు పంచేందుకే ఈ సదస్సులు నిర్వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ముప్పాళ్ల గిరి కుమార్ రెడ్డి,విఆర్వో లు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.