ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, పర్యావరణాన్ని కాపాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని బీఎంర్ నగర్ లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలువారి ఇంటి పరిసరాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనంగా ఉంచుకోవాల న్నారు.సూళ్లూరుపేట నియోజకవర్గంలో 8.9 శాతం అడవులు మాత్రమే ఉన్నాయని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని సూచించారు.నాయుడుపేట పట్టణంలో బిఎంఆర్ నగర్ లో మున్సిపల్ పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు. సూళ్లూరుపేట పట్టణంలో ఒక మున్సిపల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట మాజీ ఏఎంసి చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ, నాయుడుపేట మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ మైలారి శోభారాణి,ఓజిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుజ్జలపూడి విజయ్ కుమార్ నాయుడు, పెళ్లకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య,దొరవారిసత్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు, కట్టా వెంకట రమణారెడ్డి,ఆరవ పిరమిడ్ మాజీ సర్పంచ్ సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పసల గంగా ప్రసాద్, నానా బాల సుబ్బారావు,మైలారి రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.