ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా ఇ. కిరణ్మయి శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. సూళ్లూరుపేట లో ఉన్నటువంటి రంగాల చంద్రముని బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వి కిరణ్మయి పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆమెను సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ ఆమె భర్త పార్థసారధి ఇరువురు ఆమెతో మాట్లాడి అభినందించారు. ఆమె గుంటూరులో పనిచేసి విజయవాడ లో పని చేసి బదిలీ పై సూళ్లూరుపేట కు రావడం జరిగినది ఆమె ను ఆర్డీవో కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికి ఆహ్వానించారు. కార్యక్రమం లో ఆర్డీవో కార్యాలయం డి ఏ ఒ కే రవికుమార్ ఆమె కు స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం బదిలీ అయి వెళ్ళిపోతున్న ఆర్డీవో ఆర్ చంద్రముని కి ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనను శాలువాలతో సన్మానించి అభినందించారు. బదిలీపై వెళ్లిన ఆర్డీవో చండ్రముని వారి సతీమణి కి ఘన వీడ్కోలు పలికారు ఆర్డీవో కార్యాలయం సిబ్బంది ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు అభినందించారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.