సంస్కృతికి ప్రతిరూపం
జీవనసౌందర్యం
అసమానతలు తొలగించి
మానవజాతి పరిణామంలో
కొత్తచివురు తొడిగించేది
తెలుగుభాష ఒక్కటే.
అమ్మనేర్పిన భాష
అమ్మకుఇష్టమైన భాష
మన అమ్మభాష తెలుగు
జనమంతా తెలుగు
జగమంతా వెలుగు.
ఇసుకలో మట్టిపలకలమీద
ప్రకాశిస్తున్న తెలుగుభాష
యుగయుగాల్లో రాజస్థానాల్లో
వెలిగిన జీవద్భాష
పలుకులసొగసు తెలుగుకేతెలుసు.
పదాలపెదవులమీద మెదలుతుంటే
కలంతో వాటిని సమంచేసి
అక్షరాలుగా కూర్చి
కవిత్వమనే సంపదను సృష్టిద్దాం
తెలుగుభాష గొప్పదనాన్ని
గణనీయంగా వెలిగిద్దాం
తెలుగును ఎప్పటికీ
సజీవంగా నిలుపుదాం…
తాడినాడ భాస్కర రావు, సాహితీ సామ్రాజ్యం, అధ్యక్షులు
తణుకు.9441831544
పలుకులసొగసు తెలుగుకేతెలుసు…!
Related Posts
మంత్రి నారాయణ ను కలిసిన నాయుడుపేట టిడిపి నేతలు
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ను శనివారం టిడిపి నేతలు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ,టిడిపి నేత నెలవల రాజేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసంలో ఆయనను కలిసిన వారు మంత్రి నారాయణ కు శాలువాలు కప్పి,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో పలు సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు.…
Read moreప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి…పర్యావరణాన్ని కాపాడాలి:ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ
ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, పర్యావరణాన్ని కాపాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని బీఎంర్ నగర్ లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలువారి ఇంటి పరిసరాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనంగా ఉంచుకోవాల న్నారు.సూళ్లూరుపేట…
Read more