ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు పర్య వేక్షణలో నేటి నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. మొత్తం 88 కళాశాలల విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం మొత్తం 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 48మంది పరిశీలకులను, రెండు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.యూజి రెండో సెమిస్టర్ పరీక్షలు సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ఆయా కళాశాలల ప్రధానాచార్యులు,చీఫ్ సూపరింటెండెంట్లు,యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులకు సహకరించాలని డాక్టర్ పద్మజ విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి ఏకేయూ డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు….– పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
Related Posts
వినుత దంపతులను చంపాలని ఎమ్మెల్యే ఆదేశాలు
శ్రీకాళహస్తి సోషల్ మీడియాలో వీడియో హల్ చల్…రెండుసార్లు ఆక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించావినుత రాజకీయ వ్యక్తిగత విషయాలు చేరవేశా…తనకు ఎమ్మెల్యే ఇరవై లక్షలు ఇచ్చారని వెల్లడిసెల్ఫ్ వీడియోలో రాయుడు సంచలన విషయాలు…కూటమినేతుల రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలుప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): శ్రీకాళహస్తిలో గత రెండు నెలలు క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇంచార్జి కోటా వినుత వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య…
Read moreపరిపాలనలో ‘ఐఏఎస్ ముద్ర’…పనిచేసిన ప్రతిచోట ‘ప్రజాకలెక్టర్’గా ‘రాజముద్ర’
అభివృద్ధిలో ఆదర్శవంతం గా శివశంకర్ సేవలుప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): పరిపాలనలో సరికొత్త వరవడికి శ్రీకారం చుడున్న ఐఏఎస్ ఆఫీసర్ శివ శంకర్ అభివృద్ధిలో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. పనిచేసిన ప్రతిచోట ప్రజా అభివృద్ధికి బీజం వేస్తూ సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ ప్రజా హారతులు పొందుతున్నారు. తద్వారా ఐఏఎస్ అధికారి ప్రజల కోసం తన సర్వీసును ఎలా ఉపయోగించాలో మాటల ద్వారా కాకుండా చేతలలో చూపుతూ తన ఉద్యోగ ధర్మాన్ని…
Read more