ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు పర్య వేక్షణలో నేటి నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. మొత్తం 88 కళాశాలల విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం మొత్తం 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 48మంది పరిశీలకులను, రెండు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.యూజి రెండో సెమిస్టర్ పరీక్షలు సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ఆయా కళాశాలల ప్రధానాచార్యులు,చీఫ్ సూపరింటెండెంట్లు,యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులకు సహకరించాలని డాక్టర్ పద్మజ విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి ఏకేయూ డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు….– పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
Related Posts
వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా:నెల్లూరు జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ యామిని రెడ్డి
ప్రభాతదర్శిని( గూడూరు ప్రతినిధి): వైసీపీ బలోపేతానికి తన వంతు కృషిచేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు అహర్నిశలు కృషి చేస్తారని నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులు ఊ టుకూరు యామిని రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, తనదైన ముద్ర వేస్తున్న యువ నాయకురాలు ఊటుకూరు యామిని రెడ్డి గారికి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. నెల్లూరు…
Read moreలడ్డు డైవర్ట్ రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలి:సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):దేశంలో ప్రమాదకరమైన రాజకీయాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని దేశ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా బహుళజాతి సంస్థలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. మంగళవారం ఉదయం స్థానిక సూర్యకళామందిరం లో సీపీఐ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధిపై దృష్టి చూపకుండా తిరుమల…
Read more