ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు పర్య వేక్షణలో నేటి నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. మొత్తం 88 కళాశాలల విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం మొత్తం 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 48మంది పరిశీలకులను, రెండు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.యూజి రెండో సెమిస్టర్ పరీక్షలు సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ఆయా కళాశాలల ప్రధానాచార్యులు,చీఫ్ సూపరింటెండెంట్లు,యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులకు సహకరించాలని డాక్టర్ పద్మజ విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి ఏకేయూ డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు….– పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
Related Posts
ఏపీలో 50 నియోజకవర్గాల విభజననకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
విభజన బిల్లుకి కదలిక…2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ- బ్యూరో): 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జన గణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి.…
Read moreఅవినీతిపరుల బినామీ ఆస్తులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిఘా: ఏసీబీ డీజీ అతుల్ సింగ్
మూడేళ్లలో దోషులకు శిక్ష పడేలా కొత్త లక్ష్యం నిర్దేశించుకున్న ఏసీబీ2025లో రెవెన్యూ శాఖలోనే అత్యధిక అవినీతి కేసుల నమోదుఅవినీతిపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తిప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి):రాష్ట్రంలో అవినీతి తిమింగలాల పని పడతామని, వారిపై ఇప్పటికే నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ (డీజీ) అతుల్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారికి మూడేళ్లలోనే శిక్ష పడేలా…
Read more