ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి): ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.అంజి రెడ్డి ఆదేశానుసారం,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు పర్య వేక్షణలో నేటి నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. మొత్తం 88 కళాశాలల విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం మొత్తం 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 48మంది పరిశీలకులను, రెండు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.యూజి రెండో సెమిస్టర్ పరీక్షలు సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ఆయా కళాశాలల ప్రధానాచార్యులు,చీఫ్ సూపరింటెండెంట్లు,యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులకు సహకరించాలని డాక్టర్ పద్మజ విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి ఏకేయూ డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు….– పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
Related Posts
రమాదేవి మల్టీస్పెషల్టి హాస్పిటల్ వెంటనే సీజ్ చేయండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తిరుపతి నగరంలోని స్థానిక భవాని నగర్ లో ఉన్న రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ పలమనేరు మండలం జీడిమకుల పల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో తొమ్మిది రోజుల…
Read moreముత్యాలమ్మ జాతరను విజయవంతంగా నిర్వహిద్దాం:ఆలయ చైర్మన్, ఆలయ ఈవో లు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఈనెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం, తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆ దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు చిల్లకూరు దాశరధరామిరెడ్డి, కార్యానిర్వహాధికారి కొమ్మలపూడి నవీన్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆలయ చైర్మన్ చిల్లకూరు దశరథ రామిరెడ్డి, ఆలయ ఈవో…
Read more