ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు నగరంలో దోమల బెడద ఎక్కువ ఉందని వాటిని నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కోరారు. శనివారం ఆయన టిడిపి ముఖ్య నాయకులతో కలిసి పట్టణంలో పారిశుధ్య, డ్రైనేజీ తదితర అంశాలపై కమిషనర్ తో చర్చించారు. ఈ సందర్భంగా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని తెలిపారు. అలాగే మురికి కాలువల్లో నీరు నిలిచిపోయి దోమల బెడద ఎక్కువగా ఉందని అన్నారు. తద్వారా దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని దోమల నివారణకు చర్యలు చేపట్టాలని వేమిరెడ్డి కమిషనర్ ను కోరారు. అలాగే రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఆయా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కమిషనర్ ను కలిసిన వారిలో కార్పొరేటర్లు కర్తం ప్రతాపరెడ్డి, శ్రీధర్, లెక్కల వెంకా రెడ్డి, యూత్ లీడర్ ముస్తాక్, కృష్ణ యాదవ్, అజయ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.