ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తమిళ హీరో విజయ్ తమిళనాడు లో రాజకీయ పాదయాత్ర కు సిద్ధం అవుతున్నారు. తమిళనాడు రాజకీయ లో పాదయాత్ర చేపట్టనున్న తొలి రాజకీయ పార్టీ నేతగా విజయ్. ఇప్పటికే తమిళింగా వెట్రి కజగం పార్టీ పేరు ను ప్రకటించిన నటుడు విజయ్. తమిళనాడు లో 2026 జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వూహ్యం తో యాక్షన్ పాన్లు తో పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్న నటుడు విజయ్. త్వరలో పాదయాత్ర కు సంబందించిన అన్ని వివరాలు వెల్లడించనున్నారు.
100 నియజకవర్గాలలో పాదయాత్ర కొనసాగే విధంగా విజయ్ ప్రణాళికలు సిద్ధం అవుతున్నారు.ఈ పాదయాత్ర ద్వారా తమిళనాడు లో అవినీతి, కులమత విభజన, అధికార దురాచారులు వంటి సమస్యల పై పోరాటమే ఎజెండాగా నటుడు విజయ్ ప్రజలలోకి వెళ్లనున్నారు.
విజయ్ రాజకీయ పాదయాత్ర తో తమిళనాడు లో రాజకీయగా ఎలాంటి ప్రభావం చూపిస్తారో వేచి చూడాల్సిందే.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.