ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నాయుడుపేట పట్టణంలోని ట్రినిటీ హాస్పిటల్ లో రాష్ట్ర విద్యాశాఖ,మానవ వనరుల అభివృద్ధి,ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా మెడి ప్లస్ బ్లడ్ బ్యాంకు సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదవరం సందీప్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్ సేవలను కొనియాడారు. ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్, నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆదవరం నాగురయ్య మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ బాబు తనదైన ముద్రతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆయన అన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి, తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ నిరూపించుకున్నారని ఆయన కొనియాడారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు సామాన్య ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని, రాష్ట్రం లోని నిరుద్యోగ యువతకు లోకేష్ ఒక ఆశాకిరణమని, ఐటీ రంగంలో పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఆదవరం అనుదీప్,బాలు, నాయుడుపేట రోటరీ క్లబ్ సభ్యులు బట్ట సుబ్రహ్మణ్యం, ట్రినిటీ హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.