ప్రభాతదర్శిని,( నెల్లూరు – ప్రతినిధి): విజయదశమి పర్వదినం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జొన్నవాడలో వెలసిన శ్రీ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం ఆలయానికి చేరుకున్న ప్రశాంతమ్మ ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొన్న ప్రశాంతమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ కామాక్షి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అమ్మ ఆశీస్సులు సీఎం పై మెండుగా ఉండాలని అన్నారు. కోవూరు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ ఛైర్మెన్ తిరుమూరు అశోక్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పెంచలయ్య, ఆలయ కమిటి సభ్యులతో పాటు జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.