ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు చిన్నపాటి వర్షానికి మురుగునీళ్లతో నిండిపోతుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలలో దుర్వాసన వెదజల్లుతుంది. అలాగే రాకపోకలకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంటలు ఎక్కడ ఉన్నాయో తెలియక ప్రమాదాలకు గురి అవుతున్నారు. అలాగే బస్సులు, లారీలు తదితర భారీ వాహనాలు రాకపోకలు వేగంగా ఉండడంతో రోడ్లలో గుంటలు ఎక్కడున్నాయో తెలియక నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో గుంటల్లో టైర్లు పడి మురికినీరు పాదచారులపై పడుతున్నాయి. పట్టణంలో సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేకుండా పోయిన కారణంగా హోలీ క్రాస్ సర్కిల్, గవండ్ల వీధి, పోస్టాఫీస్ రోడ్డు తదితర అనేక ప్రాంతాల్లో గుంటలు పడ్డ రోడ్లు మురుగునీటితో మునిగిపోతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు ఆటో వాలాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ సుందరీకరణపేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సూళ్లూరుపేట మున్సిపాలిటీ ప్రస్తుతం రోడ్లు మొత్తం గుంటల మయంగా మారిపోవడంతో అందులో కొద్దిపాటి వర్షానికి వచ్చిన నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనచోధకులు అనేక అవస్థలకు గురికావాల్సి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైన సూళ్లూరుపేట మున్సిపాలిటీ అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.