*ఎమ్మెల్యే* పులివర్తి నాని
ప్రభాతదర్శిని, (తిరుచానూరు -ప్రతినిధి): చంద్రగిరిలో టిడిపి గెలుపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు కానుకగా ఇస్తున్నట్లు ఆ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. బుధవారం ఆయన తిరుచానూరు లోనే పద్మావతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరిలో టిడిపి జెండా ఎగరవేయడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రగిరి సీటును టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు కానుకగా ఇస్తున్నామని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం భారీ మెజారిటీతో చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి
దర్శనానంతరం వేద ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో పులివర్తి నాని కుటుంబాన్ని ఆశీర్వదించారు. అధికారులు ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రోత్సహించిన నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లు శ్రీ పద్మావతి అమ్మవారికి 501 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
చంద్రబాబు కు కానుకగా చంద్రగిరి టిడిపి గెలుపు
Related Posts
14 నుండి 16 వరకు భారీ వర్షాలు.. అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ సందేశం మేరకు మన తిరుపతి జిల్లాలోని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల అధికారులు అందరూ సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్…
Read moreఅమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బొజ్జల రిషిత రెడ్డి
కరెన్సీ నోట్లతో శ్రీ సత్యమ్మ తల్లి కి అలంకరణ..ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): దసరా నవరాత్రుల్లో భాగంగా రేణిగుంట మండలం భగత్ సింగ్ కాలనీ లో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లికి శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రులలో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం పరిపాటి అయింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్…
Read more