ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):గూడూరు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులుగా హైపర్ ఛానల్ రిపోర్టర్ (సచిన్) వి నాగేంద్ర, (టీవీ-5 )ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కాలనీలో హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ అధ్యక్షులుగా వి నాగేంద్ర,ప్రధాన కార్యదర్శిగా బొలిగర్ల వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శిగా (ఐ న్యూస్ )గూడూరు డివిజన్ రిపోర్టర్ కే సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా యాక్ట్ ఛానల్ రిపోర్టర్ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా గూడూరు డివిజన్ మహా న్యూస్ రిపోర్టర్ అల్తాఫ్, ప్రజాబంధం దినపత్రిక ఎడిటర్ మీజూరు మల్లికార్జున్ , న్యాయ సలహాదారుగా గూడూర్ డివిజన్ (ఏబీఎన్) ఛానల్ రిపోర్టర్ పి రమేష్, కార్యవర్గ సభ్యులుగా గూడూరు డివిజన్ ( 10 టీవీ) రిపోర్టర్ మందా ప్రభుదాస్, గూడూరు డివిజన్(6టీవీ) రిపోర్టర్ రఘు, ఉదయం దినపత్రిక గూడూరు డివిజన్ రిపోర్టర్ బాబు మోహన్ దాస్, ఇప్పుడు దినపత్రిక రిపోర్టర్ ఉడుతా శశిధర్ లను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యవర్గ ఎన్నిక సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.