ఆదిశంకర కాలేజీ యాజమాన్యం వేధింపులా? లేక మరేమైనా ఇతర కారణలా?
మృతుడు జస్వంత్ స్వగ్రామం నెల్లూరు జిల్లా మనుబోలు
ప్రభాతదర్శిని (గూడూరు-ప్రతినిధి): తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆదిశంకర కాలేజ్ లో గురువారం ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జస్వంత్ అనే యువకుడు కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది.మృతుడు బిల్డింగ్ పై నుండి దూకేసాడని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిశంకర కాలేజ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. గతంలో అనేకమంది విద్యార్థులు కాలేజీలోనే మృతి చెందిన ఘటనలు మరవక ముందే గురువారం జస్వంత్ కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ లో విద్యార్దులు గ్రూపులు గ్యాంగ్ వార్లకు నిలయంగా మారుస్తూ, మత్తు పదార్థాలు కూడా పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలేజీ ముందరే కొన్ని గ్రూపులు కత్తులు చేతబట్టి గొడవలకు దిగడంతో అనేక మంది విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు, ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా మనుబోలు కి చెందిన జస్వంత్ మరణం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.