సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం? ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్ ను తీవ్రంగా మందలించింది.తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధితురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కలెక్టర్ తీరు తప్పు పట్టింది. తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం తనకు పునరావాసం కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రాజన్నసిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత అనే నిర్వాసితురాల పిటిషన్ పై సుదీర్ఘ కాలం విచారణ అనంతరం కవితకు అర్అండ్ఆర్ ప్యాకేజి ప్రకారం పునరావాసం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు మేరకు తనకు పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ ను బాధితురాలు కోరారు. అయితే కలెక్టర్ కోర్టును తప్పుతోవ పట్టించి ఇల్లీగల్ ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో పిటిషనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వేములవాడ ఆర్డీవోకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో బాధితురాలు కవితపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో కవిత తనకు జరిగిన అన్యాయంపై తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హై కోర్టు తీర్పును ధిక్కరించండమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసు నమోదు చేయడంపై సీరియస్ అయిన తెలంగాణ హైకోర్టు కలెక్టర్ ను కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. నిన్న ఉదయం కోర్ట్ కి హాజరు కావాల్సి ఉండగా కలెక్టర్ గైర్హాజరు అయ్యారు. కలెక్టర్ మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండకపోతే జైలుకు పంపుతామని ప్రభుత్వ తరపు న్యాయవాదికి చెప్పిన న్యాయమూర్తి మధ్యాహ్నం కోర్టుకు హాజరైన కలెక్టర్, 2 గంటల పాటు కోర్టులో నిల్చోపెట్టి తీవ్రస్థాయిలో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తప్పు అని ఎలా అంటారు, బాధితురాలిపై కేసు ఎలా నమోదు చేస్తారంటూ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కలెక్టర్ ను న్యాయస్థానం అడిగింది. దీంతో తాము మాట్లాడిన మాటలు తప్పేనని కలెక్టర్ ఒప్పుకొని బేషరతు క్షమాపణ కోరారు.