ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట-ప్రతినిధి): ఓజిలి మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై అదే మండలంలో చెందిన సీనియర్ నాయకులు కలపాటి పుల్లయ్య ఆధ్వర్యంలో వందమంది టిడిపి కార్యకర్తలు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. గ్రద్ద గుంట పంచాయతీకి చెందిన ఓ నాయకుడు పార్టీ పరపతిని అడ్డుపెట్టుకొని అవినీతి అవకతవకలకు పాల్పడుతున్నాడని ఆయన ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలలో ఎంపీటీసీ ఎన్నికలలో ఆ నాయకుడు పార్టీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి వైసిపి నాయకులకు అమ్ముడుపోయి టిడిపి అభ్యర్థుల ఓటమికి కారుకులయ్యరని ఫిర్యాదులో అందులో పేర్కొన్నారు. అలాగే ఓ టిడిపికి చెందిన రైతు నాయకునికి వచ్చిన ట్రాక్టర్ ను ట్రాక్టర్ తన పేరుతో మార్చుకున్నారని ఫిర్యాదు అందులో పేర్కొన్నారు. ఇతని అవినీతి అవకతవకలకు టిడిపి నాయకులు కార్యకర్తలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతను పై చర్యలు తీసుకొని పార్టీ నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.