ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రభాతదర్శిని(చిట్టమూరు-ప్రతినిధి):ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి లీగల్ అడ్వైజర్ అశోక్ కాంప్లె అన్నారు. శనివారం చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గూడూరు నియోజకవర్గం కోట మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దేశంలోని మనువాద అగ్రకుల పార్టీని వారి అధికారాన్ని స్తుస్థిరం చేసుకునేందుకు ఎస్సీ ఎస్టిలను విభజించి బలహీనపరిచేందుకు కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని ఆరోపించారు. అనంతరం వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానం ఆర్టికల్ 341 రిజర్వేషన్లు రాజకీయ ప్రమేయానికి వీలు కల్పిస్తూ రాష్ట్రాలకు అధికారం కలిపించిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ రద్దు చేసేవరకు ఈ వ్యతిరేక పోరాటం ఆగదని సుప్రీంకోర్టు దీన్ని తిరిగి స్వాగతించాలని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి మల్లి చిట్టమూరు అధ్యక్షులు క్రాంతి, కార్యదర్శి సురేష్ సలహాదారులు పి రాజగోపాల్, శంకరయ్య మెట్టు గ్రామ కమిటీ మెంబర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.