ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను విద్యార్థులకు బోధించాలని ఓజిలి జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మంజులమ్మ అన్నారు. గురువారం స్థానిక విద్య వనరుల కేంద్రం వద్ద నిర్వహించిన గురు పూజ దినోత్సవం సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ విద్య అభివృద్ధి విషయంలో నిరంతర సాధనతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. కేవలం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం చదువుకాదని, ఉపాధ్యాయులలో ఉన్న ఆదర్శవంతమైన విషయాలను బోధించాలన్నారు. చదువంటే పుస్తకాలలో ఉన్న అంశాలను, చెప్పడం, రాయడం కాదని, విద్యార్థులను ఉపాద్యాయులు ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దాలన్నారు. అందుకు ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉంటూ సమయపాలన పాటించడంలోనూ, విద్యాబోధనలో బోధించడంలోనూ తనదైన శైలిని చూపాలన్నారు. ఉపాధ్యాయులు ఏది చెప్తే అది విద్యార్థులు చేస్తారని ఆ ఘనత ఉపాధ్యాయులకి దక్కుతుందన్నారు. ఎంపీడీవో రజినీకాంత్ మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉపాధ్యాయుడు సుధాకర్ మాట్లాడుతూ నేడు సమాజంలో నెలకొంటున్న అసాంఘిక కార్యక్రమాలకు మద్యపానమే మూల కారణమని ఆయన అన్నారు. రాజ్యాంగంలో మద్యం ద్వారా ప్రభుత్వాలు నడవకూడదని స్పష్టంగా తెలియజేసిన పాలకులు అందుకు తిరోధకలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన శంకరయ్య, నారాయణ, శంకరయ్య లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పద్మావతి, ఎంఈఓలు శైలజ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను బోధించాలి
Related Posts
చెరువులను గుల్ల చేస్తూ…వెంచర్లకు అక్రమంగా గ్రావెల్ తరలింపు
అవినీతిలో పెళ్ళకూరు ఇరిగేషన్ ఏ.ఈ.రూటే సపరేట్… చెరువుమట్టిని మింగేస్తున్న అవినీతి తిమింగలం ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈ రూటే సపరేట్ గా ఉంది. చెరువుల అభివృద్ధికి కృషి చేయవలసిన ఆ అధికారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువులో మట్టిని మింగేస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను స్వామి భక్తితో ఆకట్టుకుంటూ పెళ్లకూరు మండలంలోని వివిధ చెరువులో మట్టిని…
Read moreఅడుగుకోక గతుకు…ఏమౌతుందో బ్రతుకు…
అధ్వాన్నంగా కోట ఆర్ అండ్ బి రోడ్లు…నిద్రావస్థలో అధికారులు…. పాలకులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రాజకీయ పరిభాషలో కోట – వాకాడు మండలాలు రాజకీయాల నిలయంగా ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు రవాణాకు సరైన మార్గాలు లేని రోజులలో కోట వాకాడు నుండి రాజకీయాలు నడిపిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయా ప్రాంతాల అభివృద్ధికి వారి వారి స్థాయిలో ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా…
Read more