ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ లో టాపర్ కొత్తనూరు వైష్ణోదేవి నిలిచారు. ప్రముఖ సినీ, సీరియల్ నటుడు శ్రీహరి- లలితభవాని దంపతుల కుమార్తె అయిన వైష్ణోదేవి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు హైదరాబాద్ లోని ఏ.ఎస్.రావు నగర్ భాష్యం స్కూల్ చదివింది. 10వ తరగతిలో 9.5 జిపిఏ మార్కులు సాధించారు. హైదరాబాద్ మణి కొండ శ్రీ చైతన్య విద్యా సంస్థ బ్రాంచ్ లో ఇంటర్మీడియట్ లో 995 /1000 మార్కులు సాధించి తెలంగాణ స్టేట్ టాపర్ నిలిచింది. ఈ సందర్భంగా చైతన్య విద్యా సంస్థ నిర్వాహకులు వైష్ణోదేవి ని ఘనంగా సన్మానించారు. తమ విద్యార్థి తెలంగాణ రాష్ట్రంలో టాపర్ గా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు.